(హైదరాబాద్, న్యూస్ఇన్)
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్పాస్ వద్ద రోడ్డు విస్తరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో 2026 జూలై 16 నుంచి 20 రోజుల పాటు అండర్పాస్ను పూర్తిగా మూసివేస్తున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్ప్రీత్ సింగ్ తెలిపారు.
వైశాలీనగర్ రైల్వే అండర్పాస్ ప్రస్తుతం ఇరుకుగా ఉండటంతో పాటు, భారీ వర్షాల సమయంలో నీరు నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అండర్పాస్ను విస్తరించడం, సమర్థవంతమైన స్టార్మ్ వాటర్ డ్రెయిన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం సంబంధిత సివిక్ అధికారులు పనులు చేపడుతున్నారు.
ఈ పనుల నిర్వహణలో భాగంగా అండర్పాస్ను తాత్కాలికంగా మూసివేసి, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు వివరాలు….
- మై హోమ్ మంగళా నుంచి వైశాలీనగర్ అండర్పాస్ మీదుగా హఫీజ్పేట్ వెళ్లే వాహనాలు
మై హోమ్ మంగళా టీ-జంక్షన్ వద్ద యూ-టర్న్ తీసుకుని రాఘవేంద్ర నగర్ కాలనీ జంక్షన్ – హైటెన్షన్ రోడ్ – ఆర్టీఏ కార్యాలయం – కొండాపూర్ – హఫీజ్పేట్ ఆర్ఓబీ మార్గంలో ప్రయాణించాలి.
- తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ వైపు నుంచి వైశాలీనగర్ అండర్పాస్కు వచ్చే వాహనాలు
మై హోమ్ మంగళా టీ-జంక్షన్ – రాఘవేంద్ర నగర్ కాలనీ – హైటెన్షన్ రోడ్ – ఆర్టీఏ కార్యాలయం – కొండాపూర్ – హఫీజ్పేట్ ఆర్ఓబీ/ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్పేట్, ఆల్విన్ జంక్షన్ వైపు వెళ్లాలి.

- హఫీజ్పేట్, ఆర్టీసీ కాలనీ, మై హోమ్ జువెల్ ప్రాంతాల నుంచి మై హోమ్ మంగళా వైపు వెళ్లే వాహనాలు
పైప్లైన్ రోడ్ – హఫీజ్పేట్ ఆర్ఓబీ/ఫ్లైఓవర్ – జెన్పాక్ట్ వద్ద ఎడమ మలుపు – కొండాపూర్–ఆల్విన్ రోడ్ – ప్రభుత్వ పాఠశాల యూ-టర్న్ – హఫీజ్పేట్ ఆర్ఓబీ ద్వారా ప్రయాణించాలి.
- వాసవి లేక్ సిటీ, హఫీజ్పేట్ లేక్ ప్రాంతాల నుంచి మై హోమ్ మంగళా, రాఘవేంద్ర నగర్ వైపు వెళ్లే వాహనాలు
స్పైర్ వన్ అపార్ట్మెంట్స్ యూ-టర్న్ – హఫీజ్పేట్ ఆర్ఓబీ – జెన్పాక్ట్ వద్ద ఎడమ మలుపు – కొండాపూర్–ఆల్విన్ రోడ్ – ప్రభుత్వ పాఠశాల యూ-టర్న్ – హఫీజ్పేట్ ఆర్ఓబీ ద్వారా ప్రయాణించాలి.
- గోపాల్నగర్, కాల్వరీ టెంపుల్ ప్రాంతాల నుంచి మై హోమ్ మంగళా వెళ్లే వాహనాలు
హఫీజ్పేట్ అండర్పాస్/ఆర్ఓబీ వద్ద కుడివైపు తిరిగి కొండాపూర్–ఆల్విన్ రోడ్ – ప్రభుత్వ పాఠశాల యూ-టర్న్ – హఫీజ్పేట్ ఆర్ఓబీ మీదుగా కొండాపూర్, రాఘవేంద్ర నగర్ వైపు వెళ్లాలి.
ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ట్రాఫిక్ నియంత్రణలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పనుల కారణంగా కలిగే తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.













Leave a Reply