(హైదరాబాద్,న్యూస్ఇన్)

తెలంగాణాలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షా ఫలితాలను ఆదివారం విడుదల చేయనుంది. ఇంటర్ బోర్డులో ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావ్ ఫలితాలను వెల్లడిస్తారని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆ తరువాత పబ్టిక్ డోమైన్లో ఫలితాలు అందుబాటులో ఉంచనుంది. ఉదయం 11 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటన విడుదల చేసింది.
ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచుతామని బోర్డు తెలిపింది. ఇందుకోసం tgbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్ సైట్లను సంప్రదించాలని సూచించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.
ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఎలా చెక్ చేసుకోవాలంటే..?
తెలంగాణ ఇంటర్ రిజల్స్ట్ కోసం అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
హోం పేజీలోని ఇంటర్ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి.
హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.
అనంతరం ఫలితాలు మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.
వాట్సప్ ద్వారా ఫలితాల వెల్లడి……
పరీక్ష మార్కుల లెక్కింపులో ఎలాంటి తేడాలు జరగకుండా ఒకటి రెండు సార్లు మూల్యాంకనం చేసింది. అయితే కేవలం ఒకటి రెండు మార్కుల దగ్గర, ఒక్క పేపర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రీ-వాల్యూయేషన్ చేసారు. ఈ సారి ఫలితాలను వాట్సప్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేసారు. గతంలో ఇదే విధానంలో హాల్ టికెట్లు విజయవంతంగా పంపిణీ చేయగా, ఇప్పుడు ఫలితాలను కూడా ఇదే రకంగా వాట్సప్ ద్వారా అందిస్తున్నారు. విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్లో 8096958096 నంబర్ను సేవ్ చేసి ‘Hi’ అని మెసేజ్ పంపాలి. అనంతరం మెనూలో “BIE Exam Result” ఎంపికను ఎంచుకుని, హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1వ సంవత్సరం/2వ సంవత్సరం), స్ట్రీమ్ (General/Vocational) వివరాలను నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన వెంటనే ఫలితాలు మెసేజ్ రూపంలో వస్తాయి.









Leave a Reply