(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ముంబాయి ఇండియన్స్ ముందు ఆర్సీబీ భారీ లక్యాన్ని విధించింది. 20 ఓవర్లలో ఆర్సీబీ 4 వికెట్లు నష్టపోయి 240 పరుగులు చేసి ఎంఐ ముందు 241 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. ఆర్సీబీ బ్యాటర్లు బౌలర్లపై వీర విహారం చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు ఎంఐ బౌలర్లపై విరుచుకు పడ్డారు. తొలి ఓవర్ నుంచి సగుటన పది పరుగులు చేయడంపై దృష్టి పెట్టారు. ఫోర్లు, సిక్స్ లతో ఫిల్ సాల్ట్ ఓ వైపు, కొహ్లీ మరో వైపు ముంబాయి బౌలర్లను ఆడుకున్నారు. బ్యాటింగ్ పిచ్ పై ఈ ఇద్దరి బ్యాటింగ్ క్రికెట్ అభిమానాలకు కొత్త జోష్ నింపింది. 8.4 ఓవర్లలోనే వంద పరుగుల స్కోరుకు ఆర్సీబీ చేరుకుంది.పది ఓవర్లను ఐదుగురు బౌలర్లు పూర్తి చేసినా….ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయడంలో విజయవంతం కాలేకపోయారు. జస్ప్రీత్ బూమ్రా, ట్రెంట్ బౌల్ట్ సహా శాంట్నర్ ల బౌలింగ్ ను ఉతికి ఆరేశారు. ప్రతి ఓవర్లోనూ ఫోర్లు, సిక్స్ లు బాదుతూ జట్టు స్కోరును వేగంగా పరుగులు పెట్టించారు. హార్దిక్ పాండ్య వేసిన 10 ఓవర్ లో ఫిల్ సాల్ట్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఇచ్చిన క్యాచ్ ను ఎంఐ ఫీల్డర్లు అందుకోలేకపోయారు.

అదే ఓవర్లో రన్ ఔట్ ప్రమాదం నుంచి సాల్డ్ బయటపడ్డారు. ఈ ఇద్దరు బ్యాటర్లను ఔట్ చేసేందుకు ఎంఐ ఆటగాళ్లంతా పలు మార్లు గ్రౌండ్లో చర్చించుకున్నారు. 34 బంతులను ఎదుర్కొన్న ఫిల్ సాల్ట్ 78 పరుగులు చేశారు. విరాట్ 24 బంతులు ఎదుర్కొని 34 పరుగులతో జట్టు స్కోరు 10 ఓవర్లలో 115 పరుగులకు చేరుకుంది. బౌలర్లను మార్చిన ఎంఐకి ఫలితం దక్కలేదు. శార్దూల్ ఠాకూర్ వేసిన 11 ఓవర్ లో ఫిల్ సాల్ట్ భారీ షాట్ ఆడబోయి ఔటయ్యరు. 11 ఓవర్లలో 120 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. సాల్ట్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కెప్టన్ రజత్ పాటిదార్ ముంబాయి బౌలర్లకు తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పేలా బ్యాటింగ్ మొదలు పెట్టారు. ఫిల్ సాల్ట్ కంటే ప్రమాదకరమైన బ్యాటింగ్ చేశారు. ఫోర్లు, సిక్స్ లతో ఎంఐ బౌలర్లను ఆడుకున్నారు. బౌలర్ ఎవరౌనా బంతిని బౌండరీకి పంపిస్తూ…భారీ స్కోరుకు బాటలు వేశారు. ఈ టౌర్నమెంట్లోనే అత్యధికంగా సిక్స్ లు కొట్టిన జట్టుకు ఆర్సీబీ అందరికంటే ముందుగా ఉంది ఈ మ్యాచ్ తో మరోసారి ఆ సంఖ్యను భారీగా పెంచుకుంది. భారీ హిట్టింగ్ చేస్తున్న పాటిదార్ కు కోహ్లీ అవకాశం కల్పిస్తూ….. పాటిదార్ ఆటను ఆస్వాదించారు.13.4 ఓవర్లలో 184 పరుగలకు ఆర్సీబీ స్కోరు చేరుకుంది. 23 బంతుల్లోనే కొహ్లీ- పాటిదార్ 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కోహ్లీ 37 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని హార్ధిక్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ తో 185 పరుగుల దగ్గర నిరాశగా వెనుదిరిగారు.

17 బంతుల్లో పాటిదార్ 53 పరుగులు సాధించారు.5 సిక్స్ లు, 4 ఫోర్లతో పూర్తి చేసుకుని భారీ షాట్ ఆడబోయి శాంట్నర్ బౌలింగ్ లో ఔటయ్యారు. 20 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేశారు. 16.4 ఓవర్లలో ఆర్సీబీ 200 పరుగులకు చేరుకుంది.15 ఓవర్ల తరువాత ఆర్సీబీ బ్యాటర్ల జోరుకు ముంబాయి బౌలర్లు కట్టడి చేయడంతో స్కోరు మందగించింది.




Leave a Reply