(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఈ నెల 18వ తేదీన బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ “యూత్ డిక్లరేషన్” పేరిట యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ బీఆర్ ఎస్ ఛలో సరూర్ నగర్ కు పిలుపునిచ్చింది.విద్యార్థులను, నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. సరూర్నగర్ వేదికగా నిర్వహించనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు స్థలాన్ని పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు MLC శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి ,కాలేరు వెంకటేష్ తదితరులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువకులను ఈ ఛలో సరూర్ నగర్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని బీఆర్ ఎస్ భావిస్తోంది. నిరోద్యోగులకు మద్దతుగా కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ నిర్వహించే ఈ సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.











Leave a Reply