(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
మరో రెండేళ్లలో రాష్ట్రంలో రెండు కొత్త ఏయిర్ పోర్టులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, రామ్మోహన్ నాయుడుల తో భేటీ అయి కొత్త ఏయిర్ పోర్టులపై చర్చలు జరిపారు. వరంగల్, ఆదిలాబాద్ లలో నిర్మించే ఈ ఏయిర్ పోర్టులను 2028 జూన్ 2 ప్రారంభించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఏయిర్ పోర్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రెండు ఎయిర్ పోర్టుల వేగవంతమైన నిర్మాణానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. దేశ జనాభాలో 2.50 శాతం జనాభా ఉన్న తెలంగాణ 5 శాతం జీడీపీ వాటా కలిగి ఉందన్నారు. వరంగల్ ఏయిర్ పోర్టు నిర్మాణం డిజైన్ లో కాకతీయ సంస్కృతి కనిపించేలా చర్యలు చేపడుతామని సీఎం అన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా కేంద్ర మంత్రులను రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కలిసి చర్చిస్తానని సీఎం తెలిపారు. నితిన్ గడ్కరితో భేటీ సందర్బంగా రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారులపై సీఎం చర్చించారు.











Leave a Reply