దేశవాళి క్రికెట్ పై దృష్టి
బీసీసీఐ నిర్ణయంతో రంగంలోకి స్టార్ క్రికెటర్లు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమ్ ఇండియా ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ తర్వాత, జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది.
కొత్త నిబంధనలు….
మీడియా నివేదికల ప్రకారం, వన్డే, టీ20 జట్లలో ఉన్న ఆటగాళ్లందరూ డిసెంబర్ 24 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీ (2025-26)లో కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. సీనియర్లు ఆడటం వల్ల యువ ఆటగాళ్లకు కూడా ప్రేరణ లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది.
16 ఏళ్ల తర్వాత విజయ్ హజారే బరిలో విరాట్..!
ఈ నిర్ణయం తర్వాత అందరి దృష్టి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పడింది. తాజా సమాచారం ప్రకారం, కోహ్లీ ఢిల్లీ జట్టు తరపున విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడు.విరాట్ కోహ్లీ చివరిసారిగా 2010లో విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. అంటే దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ టోర్నీలో కనిపించబోతున్నాడు.

అతను ఢిల్లీ తరపున రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. దీనిపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA)కు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ కూడా ముంబై తరపున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ చివరిసారిగా 2018లో ఈ టోర్నీ ఆడాడు.
టోర్నీ వివరాలు: భారత దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24, 2025 నుంచి జనవరి 18, 2026 వరకు జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా ఈవెంట్ల సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లందరూ ఫామ్లో ఉండాలని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది






Leave a Reply