(హైదరాబాద్ న్యూస్ఇన్)
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పుడు తెలంగాణా వాడినే…ఇక్కడే ఉంటాను అంటూ ప్రకటించుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రముఖ సినీ కళాకారులు హాజరై కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిలిపారు. విగ్రహావిష్కరణ అనంతరం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు నెల్లూరు తో ఉన్న అనుబంధం చెప్పే క్రమంలో “నేను అప్పుడు నెల్లూరు వాణ్ని, ఇప్పుడు తెలంగాణ వాణ్ని. ఇక్కడ ఉంటున్నాను కాబట్టి తెలంగాణ వాణ్నే. ఇకపై ఇక్కడే ఉంటాను కూడా” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. భాష, సంస్కృతి గురించి మాట్లాడిన వెంకయ్య నాయుడు, బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ మనపై రుద్దబడిందని చెప్పారు. ‘మమ్మీ–డాడీ కల్చర్ వదిలేయాలి. అమ్మ–నాన్న అనే మాటలను అలవాటు చేసుకోవాలి. మన భాషను మనమే ప్రమోట్ చేయాలి’ అంటూ పిలుపునిచ్చారు.







Leave a Reply