NewsInn

News in a Click

సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దం

బీజెపి నేత‌ల ఆగ్ర‌హం

(హైద‌రాబాద్, న్యూస్ఇన్)

తెలంగాణా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయే చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. మంగ‌ళ‌వారం జ‌రిగ‌న పార్టీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నాడు….రెండు పెళ్ళిలు చేసుకునే వాళ్లకు ఇంకో దేవుడు ఉన్నాడు….మందు తాగేటోళ్లకు మ‌రో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడని సీఎం చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దూమారం రేపు తున్నాయి.

కాంగ్రెస్ ముమ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాసే పార్టీ. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమ‌న్నారు.ఈ విషయాన్ని ముందే పసిగట్టి మొన్నటి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ గెలిస్తే హిందువులు తలెత్తుకుని బయట తిరగలేని ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించాం. సీఎం వ్యాఖ్యలను చూశాక ఇదే నిజమని తేలిపోయింది. హిందూ దేవుళ్ళ ను తూలనాడిన తెలంగాణ సిఎం హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు.దేవతలను, దేవుళ్ళను అవమానకర వ్యాఖ్యలు చేస్తూ నోటికి వచ్చినట్లు దూషించిన రేవంత్ హిందువుల మనోభావాలను కించపరిచారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెవైఎం, మ‌హిళా మోర్చ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *