NewsInn

News in a Click

వినియోగదారుడే విద్యుత్ ఉత్పత్తిదారు

ప్రభుత్వ భవనాలపై విస్తృత స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి

ఫెర్రో అల్లాయ్స్‌కు మరో ఏడాది ప్రోత్సాహకాలు పొడిగింపు

ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులు

సీఎం చంద్రబాబు నాయుడు

(అమరావతి,న్యూస్ ఇన్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి 150 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా విద్యుత్ పొదుపు చేసేలా ఉపకరణాలు వినియోగించేందుకు అవగాహనా కార్యక్రమాల్ని చేపట్టాలని సీఎం సూచించారు.

60 రోజుల్లో కార్యాచరణ

రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ఐస్(ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ) పాలసీ ద్వారా 60 రోజుల్లోనే తమ కార్యాచరణను ప్రారంభించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి అనుమతులు జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. తద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఓ న్యూ ఎనర్జీ హబ్‌గా మారాలని వ్యాఖ్యానించారు వినియోగదారులే విద్యుత్ ఉత్పత్తి చేయటం ద్వారా తాము వినియోగించుకున్న అనంతరం మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఆదాయం ఆర్జించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.

వెయ్యి ఈవీ బస్సుల కొనుగోలు

రాష్ట్ర అవ‌సరాల కోసం త్వరలోనే వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నాన్ టారిఫ్ ఆదాయం పై దృష్టి పెట్టాలని సీఎం సూచనలు చేశారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో లోటు లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు చేయాలని సూచించారు. విద్యుత్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ప్రతీ ఏటా హ్యాకథాన్ నిర్వహించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *