(హైదరాబాద్,న్యూస్ఇన్)
మంత్రి అజారుద్దీన్ ,కోదండరాం తో ఎంఎల్సీ లు గా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం శాసనమండలి చైర్మన్ ఛాంబర్ లో ఇద్దరు శాసనమండలి సభ్యులగా ప్రమాణా చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్,పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్,ఎంపీ వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ లు,ఎంఎల్సీ లు,ఎంఎల్ ఏ లు హాజరయ్యారు. కొత్త సభ్యులకు శాసనమండలి ప్రొసీజర్స్ తెలియచేసే కిట్ ను మండలి చైర్మన్ అందించారు. మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి ముందు కోదండరాం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.
వీడిన సస్పెన్స్….సీఎం చర్చలు సక్సెస్….













Leave a Reply