NewsInn

News in a Click

హై స్పీడ్ రైల్వే కారిడార్ పై సమీక్ష

హై స్పీడ్ రైల్వే కారిడార్ పై సమీక్ష

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల మంజూరు చేసిన హై స్పీడ్ రైల్వే కారిడార్ లో చేపట్టాల్సిన ప‌నుల‌ను మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. కేంద్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ నుంచి మూడు హై స్పీడ్ రైళ్ల‌ను న‌డిపించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

హైదరాబాద్ – పూణే – ముంబై
భారత్ ఫ్యూచర్ సిటీ – చెన్నై
భారత్ ఫ్యూచర్ సిటీ – బెంగళూరు హై స్పీడ్ కారిడార్ల ను ఏర్పాటు చేయ‌నుంది.

వీటిలో హైద‌రాబాద్-పుణే-ముంబాయి కారిడార్ పై డీపీఆర్ రెడీ అయింది. మిగిలిన రెండు రూట్ల‌పై కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా అధికారులు ఈ ప్రాజెక్టు గురించి వివ‌రించారు. సమీక్షలో ఆర్ అండ్ బి స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్,ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య,ఆర్ అండ్ బి ఈఎన్సి లు మోహన్ నాయక్, జయ భారతి, రైల్వే , NHSRCL అధికారులు,HMDA,MAUD,HMRL అధికారులు తదితరులు. పాల్గొన్నారు. అంత‌ర్జాతీయ విమ‌నాశ్రాయానికి స‌మీపంలోనే హైస్పీడ్ రైల్ కారిడ‌ర్ కు స్థ‌లం కేటాయిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి గ‌తంలోనే ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *