(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలోని ప్రతిపక్ష పార్టీ రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ ఎస్ హాట్ హాట్ గా మారింది. తెలంగాణా ఉద్యమం మొదలైన నాటి నుంచి గులాబీ పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో రాజకీయాలు చేసి తెలంగాణా ఉద్యమాన్ని ఉధృతం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర సాధన కూడా సాకారమైంది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావం తరువాత గులాబీ పార్టీ అదికారంలోకి అవతరించడంతో తొలి ఐదేళ్ల పాటు తెలంగాణా పునర్నిర్మాణం పేరుతో ప్రభుత్వం పూర్తిగా పాలనపై దృష్టి పెట్టింది. ఇక తెలంగాణాలో గులాబీ పార్టీ కి తిరుగు లేదని భావించిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.

టీఆర్ ఎస్ పార్టీని జాతీయ రాజకీయాలకు అనుగుణంగా బీఆర్ ఎస్ మార్చే ప్రక్రియను పూర్తి చేశారు. పార్లమెంట్ ఎన్నిలకు దాదాపు రెండేళ్లు ముందు నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల ను గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున చేర్చుకున్నారు. మహారాష్ట్,, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పర్యటనలు చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేశారు. టీఆర్ ఎస్ బీఆర్ ఎస్ గా జాతీయ రాజకీయాల్లో బీజీ కావడంతో…. తెలంగాణాలో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం తెలంగాణా నేతలకు, పార్టీ వ్యూహాలపై దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రంలో అధికారం కోల్పోవాల్సి వచ్చింది.

ఈ సమయంలో గులాబీ పార్టీలో ఈ విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. టీఆర్ ఎస్ పార్టీ పేరు బీఆర్ ఎస్ గా మారడంతోనే ఈ పరిస్థితి వచ్చిందిన నేతలు కేసీఆర్ ముందు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పినా….పార్టీ అధినేత ఈ విషయంలో నేతల అభిప్రాయలను పరిగణలోకి తీసకోలేదు. పార్టీ పేరుతో సంబంధం లేదని, పార్టీ గుర్తు ప్రధాన పాత్ర పోషిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్చకు ముగింపు పలకముందే టీఆర్ ఎస్ పార్టీ పేరుతో పలు రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. తెలంగాణా రాష్ట్ర సమితి పేరు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో గులాబీ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవిత టీఆర్ ఎస్ పేరు అబ్రివేషన్ వచ్చే విధంగా తెలంగాణా రాష్ట్ర సేన పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. టీఆర్ ఎస్ పార్టీ పేరు వచ్చేలా సిద్దిపేటకు చెంది.న మరో వ్యక్తి తెలంగాణా రాజ్య సమితి పేరును రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఈ రెండు తెలంగాణా రాష్ట్ర సమతి పార్టీ సైలెంట్ గా ఉన్నా…తెలంగాణా రాష్ట్ర సేన వర్సెస్ తెలంగాణా రాజ్య సమితి గా మారి పోయింది.

టీఆర్ ఎస్ పార్టీ పేరును తప్పు బడుతూ తెలంగాణా రాజ్య సమితి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో తాజా టీఆర్ ఎస్ వ్యవస్థాపకురాలు కవిత వర్గం తెలంగాణా రాజ్య సమితి వెనుక మాజీ మంత్రి హరీష్ రావ్ ఉన్నారని ఆరోపణలు మొదలు పెట్టింది. సిద్దిపేట కు చెందిన వ్యక్తితో ముందు జాగ్రతగా హరీష్ రావ్ ఈ తెలంగాణా రాజ్య సమితిని ఏర్పాటు చేయించరని విమర్శలు తీవ్రం చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ హాట్ గా చర్చకు దారి తీస్తుంది. ఒరిజినల్ టీఆర్ఎస్ సైలెంట్ కావడంతో అదే పేరుతో పుట్టుకొచ్చిన కొత్త టీఆర్ ఎస్ పార్టీలు రచ్చకెక్కుతున్నాయి. కవిత టీఆర్ ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తరువాత అసలు, నకిలీ అంటూ బీఆర్ ఎస్ సోషల్ మీడియాలో వాణిజ్య ఉత్పత్తులను పోలుస్తూ ప్రచారం చేసింది.











Leave a Reply