(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి కానీ…. సాధారణ జీవితానికి ఆయన పెట్టింది పేరు. తమిళనాడు తో కలిసే ఉండే పుదుచ్చేరి రాజకీయాల్లో ఎన్. రంగస్వామి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. హంగు ఆర్భాటాలకు ఏమాత్రం ఇవ్వకుండా.. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన సాధారణ ప్రజల మధ్యే సాధారణంగా వ్యవహరిస్తారు. ఇదే ఆయనకు రాజకీయంగా బలమైన పునాదులు వేసింది. జాతీయ పార్టీలకే పుదుచ్చేరిలో రంగస్వామి బలంతో అధికారం పంచుకుంటాయి. రంగస్వామి ఏ కూటమిలో ఉంటే ఆ కూటమిదే విజయం అనేది మరోసారి ఈ ఎన్నికలతో రుజువైంది. ఆయన గడిపే సాధారణ జీవితమే…పుదుచ్చేరిలో ఆయనకు తిరుగులేని పట్టు సాధించేలా చేసింది.

ఆయన వ్యవహార శైలిని పరిశీలిస్తే…. ఏ ముఖ్యమంత్రి వ్యవహార శైలి సరిపోదని చెప్పడంలో అతిశయోక్తి కాదు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలను రాష్ట్ర విభజనకు ముందు నుంచి అత్యంత సమీపంగా చూసిన జర్నలిస్టులుగా ఈ విషయాన్ని చెప్పక తప్పడం లేదు. జర్నలిజంలో సీనియర్ పాత్రికేయులుగా అనుభవం ఉన్న మేము నలుగురం మిత్రులం పాండిచ్చేరి పర్యటనకు వెళ్ళాము. అక్కడ ఫ్రెంచ్ కాలనీలోని ఒక టూరిస్ట్ ప్లేస్ … పక్కా ప్రణాళిక ప్రకారం ఆ కాలనీ ఫ్రెంచ్ పాలకుల హాయంలో ఏర్పడింది. ఇది టూరిస్టులకు చూసేందుకు ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ కాలనీ నిర్మాణాలు ఫ్రెంచ్ నిర్మాణాలను పోలి ఉంటాయి. మేము ఆ కాలనీ నుంచి గట్టిగా మాట్లాడుతూ వెళుతుంటే హోటల్ ఫుట్ పాత్ పైనే ముఖ్యమంత్రి రంగస్వామి సహా మరికొంత మంది సాధారణ హోటల్ ముందు సాయంత్రం వేళలో టీ తాగుతూ పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మేము పెద్దగా గమనించలేదు…. ఆ హోటల్ ముందు నుంచి వెళుతున్న మాకు సివిల్ డ్రెస్ లో ఉన్న ఒక పోలీసు అధికారి మా దగ్గరకు వచ్చి సీఎం గారు ఉన్నారంటూ అప్రమత్తం చేశారు…. అంతకుమించి ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ఎక్కడున్నారని ఆ పోలీస్ అధికారిని మేము అడిగితే…. హోటల్ ముందు టీ తాగుతున్న సీఎం తో పాటు మిగిలిన వారందరినీ ఆ పోలీసు అధికారి చూపించారు.

సీఎం గారిని కలవాలని ఆ పోలీసు అధికారిని మేము కోరడంతో…సార్ టీ తాగిన తర్వాత కలవచ్చని అప్పటివరకు ఆగుతామంటే మీ ఇష్టం అంటూ పోలీసు అధికారి మాకు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను కలుసుకోవాలంటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి గుర్తు చేసుకున్న మేమంతా… సరే అంటూ పది నిమిషాలు ఆగాము…. పోలీసు అధికారి ఇప్పుడు సీఎం గారిని మీరు కలవచ్చు అంటూ చెప్పడంతో… మేమంతా హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి చూసేందుకు టూరిస్టులుగా వచ్చామని చెబుతూనే రంగస్వామి ని కలిసాము. ముఖ్యమంత్రి గారే అక్కడున్న వారిని పరిచయం చేయిస్తూ ఒకరు స్పీకర్, అని మరొకరు ఆర్ అండ్ బి మంత్రి ఆని, ఒకరు ఎమ్మెల్యే అని చెప్పారు. పాండిచ్చేరి వీధులు ఎలా ఉన్నాయంటూ మాతో సీఎం స్వయంగా ఆరా తీశారుమేము హైదరాబాద్లో రాష్ట్ర రాజకీయాలను కవర్ చేస్తామని చెప్పడంతో… స్పీకర్ వీలైతే అసెంబ్లీకి రమ్మని అన్నారు. అప్పటికి రెండు రోజులు మా పాండిచ్చేరి పర్యటన పూర్తి కావడం, ఆ మరుసటి రోజు ఉదయమే మరోవైపు వెళ్లాల్సి ఉండడంతో… సాధ్యం కాదని చెప్పాము. మళ్లీ పాండిచ్చేరికి వస్తే ఖచ్చితంగా కలుస్తామని చెప్పి అక్కడి నుంచి బయలు దేరాము… నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా… ఆయన జీవితం ప్రజాసేవకే అంకితమైంది. ప్రజల మధ్యలో ఉంటూ సాధారణ జీవితాన్ని గడిపేందుకే ఆసక్తి చూపిస్తారని మా 10 నిమిషాల అనుభవంతో మాకు తెలిసి వచ్చింది.
పుదెచ్చేరిలో ఎవరికి ఎన్ని స్థానాలు….

పుదుచ్చేరి ప్రజలకు తెరిచిన పుస్తకమే…
పాండిచ్ఛేరి ప్రజలకు ఆయన రాజకీయ, వ్యక్తి గత జీవితం తెరిచిన పుస్తం వంటింది. ఏ సమయంలో ఎక్కడ ఉంటారో…ఎలా కలుసుకోవాలో ఆ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే నెహ్రూ వీధికి వెళ్లాలి. అక్క ఆయన తన స్నేహితుడి ఇంట్లో ఉంటాని రంగస్వామి నివసించే వీధిలోనే ఉండే ఒక యువకుడు చెప్పిన మాటే ఇందుకు నిదర్శనం. పాండిచ్చేరిలో బలమైన వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించినా…. 2011లో అఖిల భారత ఎన్. ఆర్. కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సి) అనే తన సొంత పార్టీని స్థాపించారు. 2001లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2006 నుండి 2008 వరకు రెండోసారి పదవిలో ఉన్నారు. 2011లో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2021లో నాలుగోసారి పదవి చేపట్టారు. 2026 లో మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. తట్టంచవాడి నియోజకవర్గం నుంచి ఇప్పుడు కూడా విజయం సాధించారు. ఐదోసారి ముఖ్యమంత్రి పదవి మరోసారి దక్కించుకుంటున్నారు.

గురువు అప్పా పైత్యం స్వామి..
ప్రజాదరణ పొందిన నాయకుడైన ఆయన సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు.చాలా మంది ఆయనను ఒక ఆధ్యాత్మిక అన్వేషిగా, సౌమ్యమైన క్రమశిక్షణావాదిగా భావిస్తారు. పూజ్య గురువు అయిన అప్పా పైత్యం స్వామిగారికి పరమ భక్తుడైన రంగస్వామి ఎల్లప్పుడూ తన నుదుటిపై పవిత్రమైన భస్మాన్ని ధరిస్తారు. ఆ ఆధ్యాత్మిక గురువు ఫోటో ఆయన ప్రచార వాహనాన్ని అలంకరించడమే కాకుండా, ఆయన ప్రచార సామగ్రిలో కూడా ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.ఈ ఆలయంలో ‘మౌన వ్రతం’ పాటిస్తాడు, ఎప్పుడు అన్నదానం చేస్తారని స్థానికులు చెబుతుంటారు.










Leave a Reply