(అమరావతి, న్యూస్ఇన్)
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తమ వాహన శ్రేణిని కుదించుకున్నారు. సీఎం చంద్రబాబు మొత్తం 12 వాహనాల కాన్వాయ్ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ నాలుగు వాహన కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు.

అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన వాహన శ్రేణిని కుందించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50 శాతం వాహనాలు తగ్గించాలని భద్రత అధికారులకు సూచనలు చేయడంతో అందుకు అనుగుణంగా కాన్వాయ్ లో మార్పులు చేశారు. మంత్రులు ఉన్నతాధికారులు కూడా ఇదే విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ రోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు ఉన్నతాధికారులకు కూడా పలు సూచనలు చేశారు. ప్రధాని పొదపు మంత్రం జపించేందుకు చంద్రబాబు చర్యలు చేపట్టారు. ప్రధాని చేసిన 8 సూచనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ఇక ఆన్లైన్ లోనే సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది.












Leave a Reply