NewsInn

News in a Click

ప్ర‌ధాని మోడీ హాయంలో 93 శాతం పేప‌ర్లు లీక్

ప్ర‌ధాని మోడీ హాయంలో 93 శాతం పేప‌ర్లు లీక్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప్ర‌ధాని మోడీ హ‌యాంలో 93 పేప‌ర్లు లీక్ అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీట్-యూజీ 2026 రద్దు… మోడీ ప్రభుత్వ నియంతృత్వ… నిరంకుశ‌ నిర్ణయమ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వ ఏక‌ప‌క్ష ర‌ద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర‌ ప్రభావం ప‌డుతుంద‌న్నారు. దీంతో రెండు కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పేప‌ర్ లీక్ జ‌రిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదని ముఖ్య‌మంత్రి విమర్శించారు.

నీట్ రద్దు.. దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన పెద్ద నోట్ల రద్దు వంటిదేన‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ అనాలోచిత, నిర్లక్ష్యపూరితమైన ఈ నిర్ణయం దేశ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింద‌న్నారు. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువత‌ను తీవ్ర అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయ‌ని చెప్పారు.2019 నుండి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయినా, ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేద‌న్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీక్‌లకు ప్రధాన కేంద్రాలుగా మారాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్​ అయ్యాయఉత్త‌ర్ ప్ర‌దేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ కుంభకోణాల జాబితాలో ఉన్నాయ‌ని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా, విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక హామీ ఇచ్చారు. నీట్ ర‌ద్దు నేప‌థ్యంలో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళన చెందవ‌ద్ద‌ని భ‌రోసానిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి, వారి కుటుంబానికి అండగా నిలుస్తుందని హ‌మీనిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *