
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణలో పెరుగుతున్న గోవధ ఘటనలపై విహెచ్ పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి డా.సురేంద్ర కుమార్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. 1977 సంవతసరం నుంచి గోవధ నిషేధ చట్టం అమలులో ఉన్నప్పటికీ, గత 50 ఏళ్లలో ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చట్టంలోని లొసుగుల కారణంగా గోవధ చేస్తున్న వారికి శిక్షలు పడడం లేదన్నారు. చట్ట సవరణ కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విహెచ్పి లీగల్ సెల్ ఏర్పాటు చేస్తోందని ప్రకటించారు.సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, జై శ్రీరామ్ నినాదంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను జైన్ తప్పు బట్టారు. హిందూ సమాజం విశ్వాసాలను అవమానిస్తే సహించబోదని హెచ్చరించారు. హిందూ దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాల నిర్వహణకే వినియోగించాలని డిమాండ్ చేశారు.
దేశంలో జరుగుతున్న మత మార్పిడిలను నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఒక మోడల్ మతమార్పిడి నిరోధక చట్టం ముసాయిదాను విహెచ్పి బృందాలు అందజేస్తాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన హేట్ స్పీచ్ బిల్లు ను హిందూ సమాజం గొంతు నొక్కడానికి ఉపయోగిస్తే, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.












Leave a Reply