NewsInn

News in a Click

బండి భ‌గీర‌థ్ కేసు పై సీరియ‌స్ గా ఉన్నాం-సీఎం

బండి భ‌గీర‌థ్ కేసు పై సీరియ‌స్ గా ఉన్నాం-సీఎం

(హైద‌రాబాద్,,న్యూస్ఇన్‌)

బండి సంజ‌య్ కేసులో ప్ర‌భుత్వం సీరియ‌స్ గా ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.బండి భ‌గీర‌థ్ ను విచారణకు బండి సంజయ్ తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కీలకమైన హోదాలో ఉండి హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత సంజయ్ పై ఉందన్నారు. తనకు తానుగా ఆయన కొడుకును విచారణకు అప్పగించాలని కోరారు. ఇదే స‌మ‌యంలో బాధిత కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. 8న అమ్మాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ప్రధాని రావడంతో పోలీసులు ఆ బందోబస్తులో ఉన్నారు. 11న మళ్ళీ అమ్మాయి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతే ఫోక్సో కేసు నమోదైంది.

భ‌గీర‌థ్ పై ఫిర్యాదు అందితే సంజ‌య్ ను అరెస్టు చేయాలా…

మాకు ఎవరైనా ఒక్కటే. నేరస్థుడిని శిక్షించే బాధ్యత నాది. తల్లి ఫిర్యాదు కంటే మైనర్ అమ్మాయి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసులో కేసును నిర్లక్ష్యం చేయడం లేదు. బండి సంజయ్ కొడుకు మీద కేసు నమోదు అయితే బండి సంజయ్ ను అరెస్ట్ చేయాలా అని సీఎం ప్రశ్నించారు. దీనిపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని, గడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పి ఆ గడీల కోసం ఇప్పుడు పని చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. అమ్మాయి సర్టిఫికెట్లు సేకరించామని తెలిపారు. ఆధారాలు సేకరించామని, స‌రైన‌ ఆధారాలు దొరికితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. హడావిడిగా.. తనపై కేసీఆర్ కేసు పెట్టినట్లు మేం తొందరపాటు చర్యలు తీసుకోలేదని అన్నారు. తాము బాధితులకు న్యాయం చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *