(హైదరాబాద్,న్యూస్ఇన్)
పోక్సో కేసు నమోదు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కు నిరాషే ఎదురైంది. బేయిల్ వస్తుందన్న ధీమాతో 13వ తేదీన పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన ఉన్నా…15వ తేదీ వరకు గడువు కోరారు. రెండు రోజుల పాటు కోర్టులో ఈ కేసు పై విచారణలో జరిగినా కోర్టు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈ నెల 8వ తేదీ న కేసు నమోదైన నాటి నుంచి భగీరథ్ అజ్ఙాతంలో ఉన్నారు. పోలీసులు కరీంనగర్ ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేసినా మేయిల్ ద్వారానే భగీరథ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక మధ్యంతర బేయిల్ పై కూడా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బండి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

రాజకీయంగా కూడా బండి సంజయ్ కేంద్ర హోమంత్రి శాఖ సహాయ మంత్రిగా ఉండడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బండి సంజయ్ కు క్లాస్ తీసుకున్నంత సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ఛానల్ నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తనయుడిని విచారణకు తీసుకొచ్చే బాధ్యత తండ్రిగా తీసుకోవాలని సూచించారు. ప్రజా స్వామ్యంలో నేతలపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయని ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాద్యత ఆయన పై ఉందన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం బాధితుల పక్షానే ఉంటుందని పూర్తి విచారణ అనంతరం భగీరథ్ పై పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళుతారని ప్రకటించారు. దీంతో బండి భగీరథ్ విషయంలో పోలీసులకు ఇబ్బంది కరమైన పరిస్థితులు తలెత్తాయి. ఒక వైపు ముఖ్యమంత్రి సీరియస్ గా వ్యాఖ్యలు చేస్తుండడం…మరోవైపు కేంద్ర మంత్రి తనయుడు పరారీలో ఉండడంతో ఎలా వ్యవహరించాలన్నది తేల్చుకోలేకపోతున్నారు.

ఈ కేసు విచారణకోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఇంచార్జ్ రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో మరో సారి కేసు విచారణలో వేగం పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తోంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పోలీసులు తదుపరి చర్చలకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది. బండి భగీరథ్ పరారీలో ఉండడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతోంది. ఇదే సమయంలో బండి సంజయ్ తన తనయుడి పోక్పో కేసు విషయంలో తన పేరును దుష్ప్రచారం చేయడం ఆపాలని కోర్టును ఆశ్రయించడం విశేషం.










Leave a Reply