(హైదరాబాద్,న్యూస్ఇన్)
బండి భగీరథ్ ను పోలీసులకు బాధ్యతగా అప్పగిస్తున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. వారం రోజుల క్రితం ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో భగీరథపై పోక్సో కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు వారం రోజులుగా అదుపులోకి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. 16వ తేదీ సాయంత్రం తన న్యాయ వాదులతో కలిసి పోలీసులకు బండి సంజయ్ అప్పగించినట్లు ప్రకటన విడుదల చేశారు.

భగీరథ్ పై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. మైనర్ బాలిక కటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన నాటి నుంచి బండి సంజయ్ రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సంజయ్ తన ఎమోషన్ ఆపుకోలేక కరీంనగర్ ఎక్తా యాత్రలో చేసిన ప్రసంగం చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో 13వ తేదీన భగీరథ్ విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు అందిచారు. కానీ భగీరథ్ ముందస్తు బేయిల్ ప్రయత్నాల్లో ఉండడంతో రెండు రోజుల సమయం కోరారు. బేయిల్ ప్రయత్నాలు సఫలం కాకపోవడం… రాజకీయ విమర్శలు తీవ్రం కావడంతో సంజయ్ తన కొడుకును అప్పగిస్తున్నట్లు ప్రకటన చేశారు.

వారం రోజులుగా పోలీసుల భగీరథ యత్నాలు….
పోలీసులు కూడా ఐదు బృందాలను ఏర్పాటు చేసి భగీరథ్ అదుపులోకి తీసుకునేందుకు గాలించినా…. ఫలితం దక్కలేదు. కానీ భగీరథ్ తన దగ్గరే ఉన్నారని సంజయ్ తన న్యాయ వాదులతో పోలీసులకు అప్పగించారు. పోక్సో ఫిర్యాదు నమోదు కావడంతోనే విచారణకు పోలీసులకు అప్పగిద్దామని భావించినా….తన న్యాయవాదులతో చర్చించి వారి ముందు తమ దగ్గర ఉన్న ఆధారాలను ఉంచినట్లు సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు. మేము చూపిన ఆధారాలతో కోర్టు కేసు కొట్టి వేస్తుందని, బేయిల్ తప్పకుండా వస్తుందని న్యాయ వాదులు చెప్పడంతోనే భగీరథ్ ను అప్పగించేందుకు ఆలస్యం చేసినట్లు సంజయ్ వెల్లడించారు. బేయిల్ వస్తుందని లాయర్లు ఇప్పుడు కూడాచెబుతున్నారని, ఎలాంటి తప్పు చేయలేదని తన కొడుకు చెబుతున్నారని బండి సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు.











Leave a Reply