NewsInn

News in a Click

భ‌గీర‌థ్ ను ప‌ట్టుకున్నారా-సంజ‌య్ అప్ప‌గించారా

భ‌గీర‌థ్ ను ప‌ట్టుకున్నారా-సంజ‌య్ అప్ప‌గించారా

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

భ‌గీర‌థ్ ను ప‌ట్టుకున్నారా…సంజ‌య్ అప్ప‌గించారా అన్న దానిపై ఎన్నో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అరెస్టు చేశామ‌ని పోలీసులు చెబుతుండ‌గా…బాధ్య‌త‌గా త‌న కొడుకును పోలీసులకు అప్ప‌గించాన‌ని సంజ‌య్ ఎక్స్ లో వెల్ల‌డించారు. ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను బండి సంజ‌య్ కార్యాల‌యం విడుద‌ల చేసింది. ఈనేప‌థ్యంలో ఇది పోలీసుల ఘ‌న‌తా….బండి సంజ‌య్ అప్ప‌గింతా అన్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్య‌త‌తో ప్ర‌తి అంశం కూడా సున్నితంగా మారింది. భ‌గీర‌థ‌పై ఫిర్యాదు చేసిన స‌మ‌యం నుంచి భ‌గీర‌థ పోలీసులు అదుపులోకి తీసుకునే వ‌ర‌కు ట్విస్ట్ ల ట్విస్ట్ లు క‌నిపించాయి. 8వ తేదీన మైన‌ర్ బాలిక పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా ముందుగా పోలీసులు నామ మాత్ర‌పు సెక్ష‌న్లు న‌మోదు చేసి బాలిక‌ను పంపించారు. భ‌గీర‌థ పై ఫిర్యాదు నుంచి వివాదాస్ప‌ద అంశంగా మారింది. పోలీసులు భ‌గీర‌థ పై కేసు న‌మోదు చేసిన‌ట్లు ఎక్క‌డా వెల్ల‌డించ‌లేదు 10వ తేదీన ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌తో పోలీసులు దీన్ని గురించి ప‌ట్టించుకోలేద‌ని స్వ‌యంగా డీజీపీ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఆ త‌రువాత సీఎం పోలీసుల‌పై సీరియ‌స్ కావ‌డంతో వెంట‌నే ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఇంచార్జ్ గా రితిరాజ్ గైక్వాడ్ ను ప్ర‌భుత్వం నియ‌మించింది. మొద‌టి రోజు విచార‌ణ చేసిన ఇంచార్జ్ వెంట‌నే బండి భ‌గీర‌థ్ ను విచారణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు జారీ చేశారు. 13 వేదీన మ‌ధ్యామ్నం పేట్ బ‌షీరాబాద్ పోలీసుస్టేష‌న్ కు హాజ‌రు కావాల‌ని సూచించారు. దీనికి భ‌గీర‌థ స‌మ‌యం తీసుకుంటూ రెండురోజుల స‌మ‌యం కావాల‌ని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. రెండు రోజుల పాటు భ‌గీర‌థ కేసు విష‌యంలో ముంద‌స్తు బేయిల్ తో పాటు మ‌ధ్యంత‌ర బేయిల్ లు ఇవ్వాల‌ని బండి న్యాయ‌వాదుల‌ను కోర్టుల‌ను ఆశ్ర‌యించారు. రెండు రోజుల పాటు కోర్టులో విచార‌ణ‌లు జ‌రిగినా…భ‌గీర‌థ‌కు ముంద‌స్తు బేయిల్ కానీ, మ‌ధ్యంత‌ర బేయిల్ కాని ద‌క్క‌లేదు.

ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఓ స‌మావేశంలో మాట్లాడుతూ బండి సంజ‌య్ బాద్య‌తాయుత‌మైన ప‌ద‌వి లో ఉండ‌డంతో త‌న కుమారుడిని విచార‌ణ‌కు స్వ‌యంగా అప్ప‌గించాల‌ని సూచించారు. సీఎం సూచ‌న‌ల త‌రువాత దాదాపు 24 గంట‌ల అనంత‌రం బండి సంజ‌య్ త‌న కుమారుడిని బాధ్య‌తా యుతంగా పోలీసుల‌కు విచార‌ణ కోసం అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంత‌కు ముందే పోలీసులు బండి భ‌గీర‌థ్ ను అప్పా జంక్ష‌న్ స‌మీపంలో అదుపులోకి తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. దీంతో ఇక్క‌డ కూడా ఎన్నో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కేంద్రం మంత్రి ప్ర‌క‌ట‌న‌లో నిజం లేదా….పోలీసుల ప్ర‌క‌ట‌న‌లో నిజం లేదా అన్న అనుమానాలు అంద‌రిలోనూ వ్య‌క్తం అవుతున్నాయి. ఇక్కడ పోలీసులు లాజిక్ మిస్ అయ్యారా….కేంద్ర మంత్రి లాజిక్ మిస్ అయ్యారా అన్న‌ది అంద‌రిలోనూ చ‌ర్చ‌నీయంశంగా మారింది. పోలీసు ఉన్న‌తాధికారులు ఓ ప్ర‌క‌ట‌న‌, మంత్రి మ‌రోప్ర‌క‌ట‌న చేయ‌డం గంద‌ర‌గోళంగా మారింది. ఏదైతేనేం బండి భ‌గీర‌థ ఎట్ట‌కేల‌కు పేట్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్ కు చేరుకోవ‌డంతో పోలీసులకు బిగ్ రిలీఫ్ ల‌భించింది.భ‌గీర‌థ్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌త్యేక పోలీసు బృందాల‌ను నియ‌మించినా ఆ బృందాలకు చిక్కకుండా పోక్సో కేసు విచార‌ణ ఎదుర్కొంటున్న‌ భ‌గీర‌థ పోలీస్ స్టేష‌న్ కు నేరుగా చేరుకున్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *