(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల నుంచి తాను మంత్రి పదవికి అర్హుడినని… అవకాశం కల్పించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రాహూల్ గాధీని కోరారు.తెలంగాణాలో మంత్రి వర్గం పునర్వ్యవస్థీకరణపై చర్చలు జరుగుతున్న సమయంలో పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి రాహూల్ గాంధీకి రాసిన లేఖ కొత్త చర్చ దారి తీస్తోంది. మంత్రి పదవి కి అర్హుడిని తానే అంటూ లేఖలో పేర్కొన్న ఆయనకు తనకు క్యాబినెట్లో అవకాశం కల్పించాలని రాహూల్ గాంధీని కోరారు. రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామోహన్ రెడ్డి క్యాబినెట్లో తనకు అవకాశం కల్పించాలని కోరారు.ఈ లేఖలో తన రాజకీయ ప్రస్థానం, కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, రంగారెడ్డి-హైదరాబాద్ ప్రాంతాల్లో చేసిన సేవల గురించి లేఖలో వివరించారు. కుటుంబ సభ్యులతో కలిసి రాహూల్ గాంధీని టి. రాంమోహన్ రెడ్డి కలుసుకున్నారు.
2023 ఎన్నికల్లో వికరాబాద్ జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంలో తాను కీలకంగా వ్యవహరించానని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేశానని లేఖలో వివరించడం విశేషం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు లేదని తెలంగాణాలో 42 శాంత ప్రజలు ఉండే ప్రాంతానికి మంత్రి పదవి లేకపోవడం పార్టీకి కూడా ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఆరుగురు అమాత్యులు గ్రేటర్ పరిధిలో ఉన్నారన్న విషయాన్ని టిఆర్ ఆర్ గుర్తు చేశారు. ఉన్నత విద్యావంతుడిగా, రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా తనను మంత్రి పదవికి ఎంపిక చేయాలని కోరారు. తనకు మంత్రిగా అవకాశం కల్పిస్తే పార్టీకి భవిష్యత్తులో దీర్ఘ కాలిక ప్రయోజనాలుంటాయని లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నేతలు క్యాబినెట్లో అవకాశం కోసం పోటీపడుతున్న సమయంలో మంత్రి పదవి దక్కించుకునేందుకు టి. రాంమోహన్ రెడ్డి రాసిన లేఖ అందరిలోనూ చర్చనీయంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించిన మల్ రెడ్డి రంగారెడ్డి కూడా ఆశిస్తున్నారు. గతంలో మంత్రి ఇవ్వాలని బహిరంగంగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన మల్ రెడ్డి గత కొన్ని రోజులుగా సైలెంట్ ఉన్నారు….తాజాగా రాంమోహన్ రెడ్డి రాసిన లేఖతో మరోసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అమాత్య పదవులు ఆశిస్తున్న నేతలంతా ఒక్క సారిగా అలెర్ట్ అయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అయిష్టంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. స్పీకర్ పదవి కట్టబెట్టే సమయంలో పునర్వ్యవస్థీకరణ సమయంలో క్యాబినెట్లోకి తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చినట్లు స్పీకర్ సన్నిహితుల్లో చర్చ వినిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న ప్రచారంలో ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు స్పీకర్ పదవి కట్టబెట్టి ప్రసాద్ కుమార్ ను క్యాబినెట్లో కి తీసుకుంటారన్న చర్చ కూడా ఉంది. రాంమోహన్ రెడ్డి లేఖ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కు చర్చకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.












Leave a Reply