
ప్రైవేటు మొబైల్ ఆపరేటర్లు తమ చార్జీలను భారీగా పెంచేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పోస్టులు వైరల్ అవుతున్నాయి. JIO,AIRTEL,VI కంపెనీలు వచ్చే ఏడాది జనవరిలో కొత్త ధరలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కనీసం 16 నుంచి 20 శాతం ధరలను పెంచే అవకాశం ఉందిని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మోర్గాన్ స్టాన్టీ కూడా అంచనా వేస్తోంది. 2024 లో మొబైల్ రీచార్జ్ ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. ఇప్పుడు తాజాగా ప్రీపేయిడ్, పోస్టు పేయిడ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టారీఫ్ లు పెరగడంతో సామాన్యలకు మోబైల్ రీచార్జ్ లు మరింత భారంగా మారనున్నాయి






Leave a Reply