ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అందుకే చర్యలు లేవు
ఎన్ రాంచందర్ రావు
(హైదరాబాద్, న్యూస్ఇన్)
భారతీయ జనతా పార్టీ,బిఆర్ఎస్ పార్టీ కలిసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని బీజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావ్ తప్పు బట్టారు. భారతీయ జనతా పార్టీ స్వతహాగా కార్యకర్తల కష్టంతో ప్రజల అండతో రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున సర్పంచులను, వార్డు సభ్యులను గెలుచుకున్నామన్నారు.కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి కాకపోతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలి.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు లోక్ సభ ఎన్నికలలో ఎవరి తరపున ప్రచారం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి సమర్ధించడం ముఖ్యమంత్రి దివాలా కోరుతనానికి నిదర్శనమని ఆరోపించారు.

42 శాతం బీసీ రిజర్వేషన్లపై మరోసారి అసెంబ్లీలో చర్చిస్తాం అనడానికి రిజర్వేషన్లను దాటవేయడానికి చేస్తున్న కుట్రలో భాగమే అన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైనప్పటికీ బీజెపి పై అబండాలు వేస్తూ ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు రావడంతో నేడు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి.బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసి ఎనిమిది స్థానాలు గెలుచుకుందని మాట్లాడం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్లే అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సీట్లు సున్నా అనే విషయం సీఎం విస్మరించారన్నారు.







Leave a Reply