(హైదరాబాద్, న్యూస్ఇన్)
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గ్యానేశ్ కుమార్ అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్కు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12.00 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీశైలంలోని భ్రమరాంభ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మహా ఆరతి కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. శ్రీశైలంలో సీఈసీ పర్యటన పూర్తిగా భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం.

హైదరాబాద్ షెడ్యూల్లో భాగంగా గ్యానెష్ కుమార్ నగరంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో గోల్కొండ కోట, హుస్సేన్సాగర్, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంలను సందర్శిస్తారు. 21వ తేదీ తెలంగాణ రాష్ట్ర బూత్ లెవల్ అధికారులతో (బీఎల్వోలు) రవీంద్రభారతి ఆడిటోరియంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు.






Leave a Reply