NewsInn

News in a Click

బండి భగీరథ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

బండి భగీరథ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

(హైదరాబాద్,న్యూస్ఇన్‌)

బండి భ‌గీర‌థ్ కేసులో ప్ర‌భుత్వం మ‌రోసిట్ నియ‌మించింది.ఈ నెల 8వ తేదీన పోక్సో కేసు భ‌గీర‌థ‌పై న‌మోదు కాగా ఆ తరువాత వారం రోజులుగా భ‌గీర‌థ్ పోలీసుల‌కు స‌రెండ‌ర్ అయిన‌ట్లు బండి సంజ‌య్ వెల్ల‌డించారు. పోక్సో కేసు వివాదాస్ప‌దంగా మార‌డంతో ప్ర‌భుత్వం ఈ కేసును విచార‌ణ వేగ‌వంతం చేసేందుకు సిట్ నియ‌మించింది. ఇదే స‌మ‌యంలో భ‌గీరథ్ ముంద‌స్తు బేయిల్ తో పాటు మ‌ధ్యంత‌ర బేయిల్ ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు న్యాయ స్థానాల్లో చేశారు.

సోష‌ల్ మీడియా ఫైట్………

ఈ రెండు పిటీష‌న్ల‌లో జూనియ‌ర్ బండికి సానుకూలంగా ఫ‌లితం రాలేదు. దీంతో ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు లొంగి పోయారు. అయితే ఈ కేసులో బండి భ‌గీర‌థ్ ప‌రారీలో ఉన్నన్ని రోజులు సోష‌ల్ మీడియాలో ఈ విష‌యంపై ఎంతో కంటెంట్ క్రియేట‌ర్ల ఒక్కోలా స్పందించారు. కొంత మంది బండి కి మ‌ద్ద‌తుగా, మ‌రికొంత మంది ఆ బాలిక‌కు న్యాయం జ‌రుగాల‌ని డిమాండ్ చేశారు. ఇవి కూడా కంటెంట్ క్రియోట‌ర్ల మ‌ధ్య ప‌రోక్ష యుద్ధానికి దారి తీశాయి. ఇక్క‌డ రెండు వ‌ర్గాలుగా విడిపోయి సోష‌ల్ మీడియాలో కూడా ఫైట్ జ‌రిగింది.

వివాదాస్ప‌ద కామెంట్లు…..

అయితే జూనియ‌ర్ బండి పోక్సో కేసు విచార‌ణ జ‌రిగిన రోజు కూడా ప‌లు వివాదాస్ప‌ద కామెంట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. దీంతో కేసు విచారిస్తున్న జ‌డ్జి కూడా ఈ కామెంట్ల‌పై ఘాటుగా స్పందించారు. చార్మినార్ పోలీస్ స్టేష‌న్లో హై కోర్టు ఫిర్యాదు కూడా చేసింది. ద‌ర్యాప్తు చేసిన పోలీసులు బాధ్యులైన వ్య‌క్తిని అరెస్టు చేశారు.

శ్వేత ఆధ్వ‌ర్యంలో మ‌రో సిట్….

భ‌గీర‌థ కేసులో సోష‌ల్ మీడియాలో చేసిన అన్ని పోస్టుల‌పై పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. మైన‌ర్ బాలిక ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ కావ‌డం, అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం తో ఈ కేసును పోలీసులు కేసు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు.జాయింట్ సీపీ శ్వేత నేతృత్వంలో సోషల్ మీడియా పోస్టులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *