NewsInn

News in a Click

క‌విత స‌చివాల‌యం ముందు ధ‌ర్నా-అరెస్టు

క‌విత స‌చివాల‌యం ముందు ధ‌ర్నా-అరెస్టు

(హైదరాబాద్,న్యూస్ఇన్)

రైతుల బాధలను చూసి చలించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సెక్రటేరియట్ ముందు వడ్లు పోసి నిరసన తెలిపారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం ముందు కవిత వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, మహిళలు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలతో కలిసి వరికంకులు, ప్ల కార్డులతో రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్తాల్లో తీసుకు వచ్చిన వడ్లను కొందరు రైతులు సెక్రటేరియట్ ముందు పోసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖపై సమీక్ష చేయకపోవడం దారుణమన్నారు. ధాన్యం, ముక్కలు, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటలు కొనక పోవటంతో రైతులు ఆవేదనతో ఉన్నారన్నారు. తేమ శాతం ఎక్కువ ఉందంటూ ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని, తరుగు పేరిట మోసం చేస్తున్న పట్టించుకునే వారు లేరని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 45-46 డిగ్రీల టెంపరేచర్ లోనూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు… కొనుగోలు కేంద్రాల్లో కనీసం తాగడాని నీళ్ళు లేవు..టెంట్ లు కూడా వేయలేదని కవిత ప్రభుత్వ నిరక్ష్యంపై మంది పడ్డారు. వడ దెబ్బకు గురై కొందరు చనిపోయారు…పంటలను కొనే వారు లేక, అప్పులు తీరే దారి కనిపించక మరికొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు చనిపోతున్నారన్నారు. రైతులు బాధలను చూసే… ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలని, రైతులకు మేలు చేయాలని సచివాలయం వద్ద ధర్నా చేస్తున్నామని కవిత చెప్పారు. రైతుల దుఖం మామాలుగా లేదు. ధాన్యం కొనుగోలు చేయకపోగా తరుగు తీస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వడ్లు, జొన్నలు, పొద్దు తిరుగుడు పంట కొనటం లేదన్నారు.వెంటనే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కవితతో సహా రైతులు, మహిళలు, టిఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కవితను పలక్ నుమా పోలీస్ స్టేషన్ తరలించగా మిగతావారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మహిళలు, రైతులు నిరసన తెలిపారు.

ఇది కర్కోటక ప్రభుత్వం…..

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి కుప్పలపై చనిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని కవిత ప్రశ్నించారు. పలక్ నుమా పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తరవాత కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రైతుల దుఖం మామూలుగా లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాల్లో కలెక్టర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *