NewsInn

News in a Click

రాజ్యాంగం ర‌ద్దుకు బీజేపీ కుట్ర‌లు…!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

దేశంలో రాజ్యంగాన్నిర‌ద్దు చేసే కుట్ర‌ను బీజేపీ చేస్తోందని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆరోపించారు.రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపాడాలని కోరుతున్నార‌ని చెప్పారు.దేశలో ఓటు హక్కు క‌ల్పించ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు హ‌క్కుల‌ను క‌ల్పించింద‌న్నారు.2019లో ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని ఓటు చోరీ చేసి బీజేపీ అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు.ఓటు హక్కును చోరీ చేసి బీజేపీ మోసగిస్తుందని రాహుల్ గాంధీ ముందు నుంచే చెబుతున్నారు.ఎంపీ ఎన్నికల్లో దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.బీజేపీ అధికారంలోకి రాకముందు 54కోట్ల అప్పు ఉండేది.. ఇప్పుడు1లక్ష40కోట్ల అప్పు ఉంది.. రాహుల్ గాంధీ 10ఏళ్ల క్రితమే ప్రధాని అయ్యే వారు.. కానీ మ‌న్మోహ‌న్ సింగ్ కు అవ‌కాశంక‌ల్పించిందన్నారు.రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవస‌రం ఉంద‌న్నారు. కాంగ్రెస్ హాయంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింద‌న్నారు. తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామ‌ని సోనియా గాంధీ హామీ ఇచ్చి తెలంగాణాను ఇచ్చిన విష‌యాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా ఏపీకి ప్ర‌త్యేక రాష్ట్ర హోదాకావాల‌న్న కాంగ్రెస్ పార్టీని అక్క‌డ గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *