(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో ఐపీఎల్ తరహాలో TG20 లీగ్ త్వరలో ప్రారంభం కానుంది. జూన్20 వ తేదీన తొలి మ్యాచ్ నిర్వహించేందుకు హెచ్ సీఎ షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రారంభ ఎడిషన్లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి.దేశం లోని మెజార్టీ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఆయా లీగ్ మ్యాచ్ ల నుంచ ఐపీఎల్ కు ఎంపికవుతున్న ఆటగాళ్ల సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వివిధ కారణాలతో తెలంగాణాలో లీగ్ క్రికెట్ మొదలు కాలేదు. హెచ్ సీఏ కార్యదర్శిగా జీవన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి తెలంగాణాలో కూడా లీగ్ లు మొదలు పెట్టి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తొలి విడత పోటీల కోసం ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ప్రతిభ ఉన్న ఆటగాళ్ళకు అవకాశాలు కల్పించడం, క్షేత్ర స్థాయిలో క్రికెట్ను బలోపేతం చేయడం, భారతదేశపు అగ్రశ్రేణి ఫ్రాంచైజీ లీగ్లకు సమానమైన ప్రదర్శన ఇచ్చేందుకు యువ క్రికెటర్లకు అవకాశం కల్పించడం లక్ష్యంగా హెచ్ సీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు ఫ్రాంచైజీల టీషర్ట్ లను ఆవిష్కరించారు.
ప్రతిభకు టీజీ20తో గుర్తింపు…

ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి M. జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ క్రికెట్ చరిత్రలో కీలక రోజు గా చెప్పారు. TG20 కేవలం ఒక పోటీ మాత్రమే కాదు… ఇది తెలంగాణలో క్రికెట్ ప్రతిభావంతులను తయారు చేయడం, వారికి అవకాశాలు కల్పించడం వంటి కీలక ఘట్టాలకు దారి చూపుతున్నట్లు ఉందన్నారు. ఫ్రాంచైజీ జట్లను కొనుగోలు చేసేందుకు వచ్చిన బిడ్డర్లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.లీగ్లో ప్రతిభావంతమైన తెలంగాణ క్రికెటర్ల తో పాటు జాతీయ స్థాయిలో ఆడుతున్న క్రికెటర్లు కూడా పాటు పాల్గొంటారన్నారు. అనుభవజ్ఞులైన కోచ్లు, సహాయక సిబ్బంది కూడా ఐపీఎల్ నిర్వహిస్తున్న మాదిరిగానే ఉంటుందని చెప్పారు. తెలంగాణా ప్రీమియర్ లీగ్ ను నిర్వహించేందుకు మాజీ తమిళనాడు ప్రీమియర్ లీగ్ సీఇ ఓ ప్రసన్నకుమార్ కు హెచ్ సీఏ బాధ్యతలు అప్పగించింది. టీజీ 20 లీగ్ లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు జీయో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ తో చర్చలు జరుపుతున్నారు.

జూన్ 7న వేలం…..
తెలంగాణా లీగ్ 20 జట్లలో పాల్గొనే ఆటగాళ్ల వేలాన్ని జూన్ 7వ తేదీన వేయనున్నారు. 8 ఫ్రాంచేజీలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రికెట్ క్రీడాకారులను సొంతం చేసుసుకునేందుకు ఆయా ఫ్రాంచేజీలు పోటీ పడే అవకాశం ఉంది. జూన్ 20వ తేదీన తొలి మ్యాచ్ నిర్వహించేందుకు హెచ్ సీఏ షెడ్యూల్ ఖరారు చేసింది. అదే విధంగా జూలై 11 న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనుంది. టోర్ని ప్రారంభానికి ముందుగానే వాణిజ్య పరమైన ఒప్పందాలను పూర్తి చేసేందుకు చర్చలు జరుపుతోంది.







Leave a Reply