NewsInn

News in a Click

మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి:బాల్క సుమన్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

బొగ్గు గ‌ని కార్మిక సంఘానికి గుర్తింపు రావాలంటే మిలిటెంట్ యాక్టివిటీ కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేయాల‌ని మాజీ ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్య‌లు దూమారం రేపుతున్నాయి. ధాన్యం
కొనుగోళ్ల విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానంతో పాటు ఇత‌ర అంశాల‌పై పార్టీ అంత‌ర్గ‌త వేదిక‌పై మాజీ ఎంపీ బాల్క సుమ‌న్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోయినా అతి త‌క్కువ సంఖ్య‌లో మాత్ర‌మే రైతులు వ‌స్తున్నార‌ని, బీఆర్ ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే ఎక్కువ‌గా పాల్గొంటున్నార‌ని చెప్పారు. బీమారంలో ర‌హ‌దారి దిగ్భ‌దం చేస్తే రైతులు ఐదుగురు మాత్ర‌మే వ‌చ్చార‌ని, బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు వెళ్లార‌న్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని కిష్టంపేట ద‌గ్గ‌ర న‌లుగురు రైతులు ఆందోళ‌న చేస్తుంటే బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు వంద మంది వెళ్లార్నారు.రైతు స‌మ‌స్య‌ల‌పై కూడా వారు పెద్ద‌గా ముందుకు రావ‌డం లేద‌న్నారు. ఈ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని నేత‌లు సోష‌ల్ మీడియా, మీడియా స‌మావేశాలు కాకుండా మిలిటెంట్ యాక్టివిటీ మొద‌లు పెట్టాల‌ని పిలుపునిచ్చారు.

బొగ్గు గ‌ని కార్మిక సంఘం విష‌యంలో కూడా మ‌నం ప‌ట్టు సాధించాలంటే మంద‌మ‌ర్రి డివిజ‌న్ లో కార్య‌క్ర‌మం పెట్టి జీఎం ఆఫీస్ ను కాల‌బెడుదాం…ఒక నెల రోజులు జైలుకు వెళ్లి వ‌ద్దం అన్నారు. మిలిటెంట్ యాక్టివిటీపై సీరియ‌స్ గా దృష్టి పెట్టాల‌ని వ్యాఖ్య‌లు చేశారు. అవ‌స‌ర‌మైతే ఒక రోజు హైద‌రాబాద్ న‌గ‌రంలోని సింగరేణి భ‌వ‌న్ వ‌చ్చి కాల‌బెట్టి అంగ‌డి అంగ‌డి చేయాల‌న్నారు. మ‌న ప్రాంతంలో ఎన్నో రైల్వే లైన్లు ఉన్నాయ‌ని, రైలు రోకో అని కార్య‌క్ర‌మం పెట్టి ప‌ట్టాల‌ను కోసి పారేయాల‌న్నారు. ఇందుకోసం ఆర్ధిక వ‌న‌రులు అని ప్ర‌శ్నించిన ఓ కార్య‌క‌ర్త‌ను ఉద్దేశించి ఒక్క ద‌గ్గ‌ర కాల‌బెడితే నిదులు అవే స‌మ‌కూరుతాయ‌న్నారు. ఈ వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా హ్యాండిల్ లో పోస్టు చేయ‌డంతో వైర‌ల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *