(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్)
రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్లు హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ నిర్ణీత 20 ఊర్లలో 243 పరుగులు చేసి 244 పరుపుల విజయ లక్ష్యాన్ని హైదరాబాద్ ముందు ఉంచింది.
ఓపెనర్లు సృష్టించిన విధ్వంసంతో సన్ రైజర్స్ బౌలర్లు ఢీలాపడ్డారు. రాజస్థాన్ ఓపెనర్లు ఫోర్లు, సిక్స్ లతో విధ్వంసం సృష్టించారు. చోట బీమ్ కీలక మైన ఎలిమినేటర్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన తీరు సన్ రైజర్స్ బౌలర్లను ఆత్మ రక్షణలో వేసింది. మొదటి బంతి నుంచే వైభవ్ సూర్య వంశీ…. సన్ రైజర్ బౌలర్లపై అటాకింగ్ మొదలుపెట్టాడు. బౌలర్ ఎవరన్నది కూడా చూసుకోకుండా ఫోర్లు,సిక్స్ లతో తన ప్రతాపం చూపారు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఆర్ ఆర్ జట్టు 80 కి పైగా పరుగులు సాధించింది. క్రికెట్ నష్టపోకుండా భారీగా పరుగులు సాధించడంతో రాజస్థాన్ జట్టుకు శుభారంభం దక్కింది. వైభవ్ సూర్య వంశీ క్రీజు లో ఉన్నంత సేపు బ్యాటింగ్ పరిశీలిస్తే…. జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకోవడం కూడా సులువే అన్నట్లుగా ఇన్నింగ్స్ సాగింది. సన్రైజర్స్ బౌలర్లు చోట బీమ్ అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్ 12 సిక్స్ లు,5 ఫోర్లతో 97 పరుగులు చేసి ఔట్ అయ్యారు.

తొలి వికెట్ కు 8 ఓవర్లలో 125 పరుగుల వద్ద వైభవ్ అవుట్ కావడంతో… హైదరాబాద్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నంత పని అయింది. హీంగే బౌలింగ్ లో రవిచంద్రన్ కు క్యాచ్ ఇచ్చి వైభవ్ వేను తిరిగారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరో ఉపేందర్ యశస్వి జైస్వాల్ 137 పరుగుల దగ్గర రెండో వికెట్ రూపంలో ఔట్ అయ్యారు. ఆ తర్వాత జురేల్ , రియాన్ పరాగ్ లు ధాటిగానే ఇన్నింగ్స్ కొనసాగించారు. జురేల్ 21 బాల్స్ లో 50 పరుగులు, కెప్టెన్ రియాన్ పరాగ్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ పరుగుల వేగం మందగించింది. ప్రఫుల్ హింగే కీలకమైన మూడు వికెట్లు తీసుకోవడంతో హైదరాబాద్ రాజస్థాన్ బ్యాటర్ల పరుగుల వేగానికి కళ్లెం వేయడంలో విజయవంతం అయ్యారు.

పరాగ్ అవుట్ అయిన తర్వాత రాజస్థాన్ జట్టు ఊహించిన స్థాయిలో పరుగులు రాబట్టడంలో విజయవంతం కాలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారీ పరుగులు చేసే అవకాశం ఉన్నా దానిని రాజస్థాన్ బ్యాటరు సద్వినియోగం చేసుకోలేదు. ఎస్ ఆర్ హెచ్ బౌలర్ వరుసగా వికెట్లు తీయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 250 పరుగుల కు పరిమితం అయింది.








Leave a Reply