NewsInn

News in a Click

గ్లోబల్ సమ్మిట్ ప్రజల కోసం 3 రోజులు

ఉచిత రవాణా సౌకర్యం

(హైదరాబాద్, న్యూస్ఇన్)

అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – విజన్ 2047 యొక్క పబ్లిక్ ఎగ్జిబిషన్ ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 8 9 తేదీల్లో ప్రముఖులంతా వెళ్లిపోయిన తర్వాత పదో తేదీ నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వ విజన్ ప్రజలు పరిశీలించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి వెళ్లేందుకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.

తేదీలు: డిసెంబర్ 10 నుండి 13 వరకువేదిక: ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్

భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించండి.సులభంగా చేరుకోండి:

ఉచిత బస్సు సేవ! ప్రభుత్వం ప్రతిరోజూ ప్రత్యేక ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు (వెళ్లేందుకు), సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 వరకు (తిరిగి వచ్చేందుకు) నడుస్తాయి. బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్ బి నగర్ వంటి ప్రధాన కేంద్రాల నుండి అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *