NewsInn

News in a Click

న‌దీ జ‌లాల్లో వాటా కోసం బీఆర్ఎస్ ఉద్య‌మ బాట‌

న‌దీ జ‌లాల్లో వాటా కోసం బీఆర్ఎస్ ఉద్య‌మ బాట‌

ఆదివారం నాటి స‌మావేశంలో నిర్ణ‌యం

ఖరారు చేయ‌నున్న అధినేత కేసిఆర్

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

గులాబీ పార్టీ సాగునీటిపై యుధ్దానికి సిద్దం అవుతోంది. కృష్ణా, గోదావ‌రి జ‌లాల విష‌యంలో రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతోందిన గులాబీ పార్టీ భావిస్తోంది. ఇదే అంశాన్ని ఆస‌ర‌గా చేసుకుని ఉద్య‌మ‌కార్యాచ‌ర‌ణ‌కు బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ కొత్త కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ అధినేత ఆధ్య‌క్ష‌త‌న ఆదివారం తెలంగాణా భ‌వ‌న్ లో పార్టీ శాస‌న‌స‌భా ప‌క్షంతో పాటు రాష్ట్ర కార్య‌వ‌ర్గ సంయుక్త స‌మావేశం జ‌రుగ‌నుంది. ఈ స‌మావేశంలో కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను సాధించేందుకు అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించనున్నారు.ఈ జ‌లాల విషయంలో,తెలంగాణ రాష్ట్రానికి, పదేళ్ల ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకు పోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జ‌రుగ‌నుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గోదావరి, కృష్ణ జలాలను కొల్లగొడుతున్న కూడా ,దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణతో ఉద్య‌మ బాట‌లో ముందుకు వెళ్లాల‌ని గులాబీ పార్టీ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేయ‌నుంది.రాబోయే రోజుల్లో చేప‌ట్టే ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనున్నది.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు ప్ర‌తిపాద‌న‌లు ఉంచ‌డం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌ని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే అన్న అభిప్రాయంతో ఉంది.ప్ర‌భుత్వ వైఖ‌రితో పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రయోజనాలు దెబ్బతింటున్నా….రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలున్న బీజెపి నేత‌లు సైలెంట్ ఉండ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మని గులాబీ పార్టీ ప్ర‌శ్నిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది బీజెపి నేత‌లే అన్న వాద‌న‌ను గులాబీ నేత‌లు వినిపించ‌నున్నారు. రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్నినదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బిజెపి విధానాన్ని గాని., ఎదుర్కోవాలంటే.. ప్ర‌త్య‌క్ష పోరాటాల‌కు సిద్ధం కావాల‌ని గులాబీ పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో రెండేళ్ల త‌రువాత కూడా తెలంగాణా ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ల్య‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాలలో కేవలం 45 టీఎంసీలు ఒప్పుకోవడంతో తీవ్రంగా న‌ష్టం వాటిల్లుతుంద‌న్న బీఆర్ స్ వాదిస్తోంది. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదు. ఇటువంటి కీలక సమయంలో పైన తెలిపిన విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలపై ఆదివారం పార్టీ అధినేత కేసిఆర్ అధ్యక్షతన జ‌రిగే సమావేశంలో కూలంకషంగా చర్చ జరగనున్నది.అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాలను నిర్మాణము, అనుసరించాల్సిన కార్యాచరణ పై కీలక నిర్ణయాలు పార్టీ అధినేత ప్ర‌క‌టించే అవ‌కాశంఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *