(మహబూబ్ నగర్,న్యూస్ఇన్)

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం షి టీం ఆధ్వర్యంలో నేరాలపై అవగాహన సదస్సు జరుగుతుండగా, విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేపట్టి, వైస్ ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేశారు.







Leave a Reply