వైద్యుడి నుంచి రు.14 కోట్లు కొల్లగొట్టిన సైబర్ చీటర్స్
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో బురిడీ
ఫేస్ బుక్ మెసేజ్ తో స్టార్ట్…. ట్రాప్ చేసిన లేడీ
(హైదరాబాద్, న్యూస్ఇన్)
సైబర్ నేరగాళ్లను నమ్మి ఓ డాక్టర్ భారీగా నష్టపోయారు. అందమైన అమ్మాయి ఫోటోలతో ఛాటింగ్ మొదలు పెట్టిన సైబర్ నేరగాళ్లు ఆ డాక్టర్ నమ్మించారు. తమ ప్రొఫైల్ లో అందమైన అమ్మాయిల ఫోటోలతో పరిచయం పెంచుకుంటూ…..అసలు స్వరూపం నేరగాళ్లు బయటపెట్టారు. తాను ఒంటరి మహిళనని ఆ డాక్టర్ తో ఫెస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని తమ ప్రణాళికలను పకడ్భంధీగా అమలుచేసిన నేరగాల్లు రు.14 కోట్లు ఆ వైద్యుడి నుంచి కొల్లగొట్టారు. ఓంటరి మహిళగా పరిచయం చేసుకున్న మహిళ డాక్టర్ ఫెస్ బుక్ పేజీ ద్వారా నమ్మకం పెంచేలా వ్యవహరించింది. అందమైన అమ్మాయి ఫోటోను పెట్టి చాట్ చేసిన చీటర్ తమ కంపెనీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశ పెట్టారు. పెట్టుబడి పెట్టిన కొత్తలో కొన్ని లాభాలను చూసి ఆ వైద్యుడికి మరింత నమ్మకం కలిగించేలా సైబర్ నేరగాళ్ల ముఠా వ్యవహరించింది. దీన్ని నమ్మిన వైద్యుడు తన ఇంటిని అమ్మి 14 కోట్ల రుపాయాలను సైబర్ నేరగాళ్లు చేప్పినట్లు పెట్టబుడి రూపంలో పెట్టారు. ఇక లాభాల మా అటు ఉంచితే పెట్టిన డబ్బులే చేతికంద కుండా పోయాయి.

ఆలస్యంగా తాను మోసపోయాయని గుర్తించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో మరిన్ని ఆసక్తి కర విషయాలు వెలుగు చూశాయి. అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేరగాళ్లు తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లుపోలీసు విచారణలో తేలింది. కంబోడియా నుంచి ఆ వైద్యుడిని నేరగాళ్లు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చైనాకు చెందిన కొంత మంది కంబోడియా కేంద్రంగా ఇలాంటి చీటింగ్ లు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

ఇండియా నుంచి ఉద్యోగాల కల్పన పేరుతో యువకులను తీసుకెళ్లి వారిని అడ్డు పెట్టుకుని సైబర్ నేరాలకు ఈ అంతర్జాతీయ ముఠా తెగబడుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు.కంబోడియాలో ఉన్న సైబర్ నేరగాళ్లకు దేశానికి చెందిన నలుగురు వ్యక్తులకు మ్యూల్ అకౌంట్స్ తెరిచి సహకరించారు. ఈ అకౌంట్లలోకి వచ్చిన డబ్బును వివిధ మార్గాల ద్వార నేరగాళ్లు తమ ఖాతాల్లోకి మార్చుకుంటున్నారని పోలీసులు గుర్తించారు.





Leave a Reply