(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ ను కట్టడి చేయడంలో విజయ వంతం అయింది. కీలక బ్యాట్స్ మెన్లను తొందరగానే పెవిలీయన్ చేర్చడంలో జీటీ బౌలర్లు విజయవంతం అయ్యారు. పవర్ ప్లే లోనే కీలక ఆటగాల్లు వెనుదిరిగారు. ఐపీఎల్ పెద్దగా ఫాం లోని రుతు రాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ లో జీటీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. బ్యాటర్లంతా పెవీలియన్ చేరుకుంటుడగా గైక్వాడ్ ఒంటరి పోరుతో చెన్నై జట్టును గౌరవ ప్రదమైన స్కోరు వరకు తీసుకెళ్లారు.ఫాంలో ఉన్న సంజు శాంసన్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగారు. సంజు స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఉర్విల్ పటేల్ 4 పరుగులే చేసి వెనుదిరిగారు. ఆ తరువాత సర్ఫరాజ్ ఖాన్ పరుగులేమి చేయకుండానే ఔటయ్యారు.

దీంతో 5 ఓవర్లలో చెన్నై జట్టు 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.మరో వైపు క్రీజులో నిలదొక్కుకున్నా రుతురాజ్ గైక్వాడ్ కొత్తగా వస్తున్న బ్యాటర్లతో కలిసి స్కోరును పెంచే ప్రయత్నాలు చేయడంలో విజయవంతం అయ్యారు. బ్రేవిస్ 2 పరుగులుచేసి 37 పరుగలకే 4 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. గైక్వాడ్- శివం దుబేతో కలిసి జట్టు స్కోరును 15 ఓవర్లలో 96 పరుగుల వద్దకు తీసుకెళ్లారు. 22 పరుగులు చేసిన శివం దుబే 16ఓవర్లో ఔటయ్యారు. 18వ ఓవర్లో కార్తిక్ శర్మ 15 పరుగులు చేసి ఔటయ్యారు.

ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన ఓవర్టన్ 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్నా 18 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. 19వ ఓవర్లో ఓవర్టన్ కూడా 7వ వికెట్ రూపంలో ఔటయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ చివరి ఓవర్లో 15 పరుగులు రాబట్టడంతో చెన్నై జట్టు స్కోరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగుల చేయగలిగింది. రుతురాజ్ 60 బాల్స్ ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్ లతో 74 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. రబడా 3, అర్షద్ ఖాన్ 2 మిగిలిన ఇద్దరు బౌలర్లు చెరో వికెట్ తీసుకున్నారు.












Leave a Reply