NewsInn

News in a Click

సీజేపీ టార్గెట్ బీజేపీ.. దేశంలో పొలిటిక‌ల్ ట్రెండ్

సీజేపీ టార్గెట్ బీజేపీ.. దేశంలో పొలిటిక‌ల్ ట్రెండ్

(న్యూస్ఇన్‌, స్పెష‌ల్ స్టోరీ)

దేశ రాజ‌కీయాల్లో కొత్త ట్రెండ్ మొద‌లైంది. ప్ర‌ధాన‌, సాంప్ర‌దాయ రాజ‌కీయ పార్టీలను సోష‌ల్ మీడియాలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ పార్టీ వెంట తిర‌గ‌డం ప్రారంభ‌మైంది. ఢిల్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాలే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి. లోకస‌భ‌లో విప‌క్ష నేత రాహూల్ సైతం ఈ ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపేలా ప‌రిస్థితులు మారాయంటే యువ‌త ఆందోళ‌న‌ల తీవ్ర‌త క‌ళ్ల‌కు క‌ట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ రాజ‌కీయ అంశాల‌పై న్యూస్ ఇన్ అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం…..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు మూడు తీర్మానాలు, ఆరు బిల్లులు మాదిరిగా ముగుస్తుందని అందరూ భావించారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం యధావిధిగా సమావేశాలు కొనసాగుతాయని, ప్రతిపక్షాల ఆరోపణలు. నిరసనలు సర్వసాధారణమని, వాటిని సునాయసంగా అధిగమిస్తామని భరోసాగా ఉంది. కానీ ఊహించని పరిణామం బీజేపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే మోదీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఉరుములా వచ్చి మెరుపులా వ్యాపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ, మోదీ సర్కార్ పట్ల శరాఘాతంగా పరిణమించింది. నీట్ ప్రశ్నా పత్రం లీకైన అంశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసమర్థతను తిప్పికొడుతూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించింది సీజేపీ. అంతటితో విశ్రమించకుండా పార్లమెంట్ సమావేశాలను పోరాట వేదికగా మలుచుకుంది సీజేపీ. అందులో భాగంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్బంగా తొలిరోజే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసింది కాక్రోచ్ జనతా పార్టీ. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాద్యత వహిస్తూ కేంద్ర విద్యశాఖా మంత్రి ధర్మాంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది సీజేపీ.

సమావేశాలు సుజావుగా నిర్వహించాలనుకున్న కేంద్రానికి సీజేపీ రూపంలో ఊహించని కుదుపు ఎదురైంది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు పయనమైన వేలాదిమంది సీజేపీ కార్యకర్తలను నిలువరించేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసారు. భారీ బారికేడింగ్ ఏర్పాటు చేసారు. కృత్రిమ ఉనుప ముళ్ల కంచె రోడ్డుపైన పరిచారు. మూడంచెల భద్రతా వలయాన్ని పార్లమెంట్ చుట్టు మొహరింపజేసారు. ఐనప్పటికి సీజేపీ కార్యకర్తలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

ఇనుప కంచెలను దాటుకుని ముందుకు దూసుకొస్తున్న సీజేపీ కర్యకర్తలు, విద్యార్ధుల పైన భాష్ప వాయువు ప్రయోగించారు పోలీసులు. అంతటితో ఆగకుండా లాఠీలు ఝళిపించారు. విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల తోపులాటలో విద్యార్ధుల దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఐనప్పటికీ కూడా విద్యార్ధులు వెనుకంజ వేయలేదు. ఇంకా కొట్టండి అంటూ పోలీసుల మద్య ధైర్యంగా నిలబడ్డారు, మరి కొంత మంది విద్యార్ధునులు ఎందుకు కొడుతున్నారని పోలీసులను ప్రశ్నించారు తప్ప లాఠీ దెబ్బలకు భయపడి పారిపోలేదు. ఎపిసోడ్ లో కీలక మలుపు ఇక్కడే చోటుచేసుకుంది. పార్లమెంట్ ఆవరణ ముందు చోటుచేసుకున్న ఉద్రిక్త వాతావరణం చూసిన కేంద్ర హోం శాఖా మంత్రి అమీత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ తో అత్యవర సమావేశం నిర్వహించారు. పరిస్థితి తీవ్రత, శాంతిభద్రతల సమస్య, సీజేపీ డిమాండ్లపై చర్చించినట్టు సమాచారం. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వంలో సీజేపీ చలనం తీసుకురాగలిగిందనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇంతకీ సీజేపీ కి ఉన్న తెగింపు, నైతిక స్థైర్యం, బలం ఏంటి.? సీజేపీని నడిపిస్తున్న అజ్ణాత శక్తి ఎవరు.?

సరిగ్గా రెండు నెలల క్రితం చీఫ్ జస్టస్ ఆఫ్ ఇండియా యువతపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉద్భవించిందే కాక్రోచ్ జనతా పార్టీ. దీని వెనక బలమైన రాజకీయ శక్తి లేదు, లెక్కకు మించిన నిధులు లేవు, ఊరూ వాడా పటిష్టమైన కార్యాలయాలు కూడా లేవు. ఉన్నదల్లా ఆత్మవిశ్వాసం, తెలగింపు, నిలదీసే వైఖరి, ఎదురించే గుండె ధైర్యం. ఇవే సీజేపీని మడమతిప్పకుండా ముందుకు నడిపిస్తున్న ఆయుధాలు. అంతే కాకుండా శరతులు లేకుండా కాక్రోచ్ జనతా పార్టీ విధి విధానాల వైపు ఆసక్తి చూపుతూ సీజేపీకి జై కొడుతున్న జెన్ జెనరేషన్. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఉద్యామాల చరిత్ర తిరగేస్తే విద్యార్ధుల భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది. విద్యార్ధులు, యువత చరిత్ర గతిని మార్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. 1950 మరియు 1960లలో అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ అహింసాత్మక ఉద్యమాన్ని నడిపినప్పుడు.. కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులు ముందుండి నడిచారు. యువ విద్యార్థులు ‘సిట్-ఇన్’ ఉద్యమాలు, బాయ్‌కాట్‌లు మరియు ‘ఫ్రీడమ్ రైడ్స్’ వంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించి ఉద్యమాన్ని ఊపందుకునేలా చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ ప్రశ్నించే తత్వానికి, అక్షర జ్ఞానానికి మరియు సామాజిక చైతన్యానికి విద్యార్థులే అత్యుత్తమ ప్రతినిధులు అని నమ్మి, వారిని ఉద్యమాలలో భాగస్వాములను చేశారు.

అంటే చరిత్ర గతిని మార్చడంలో విద్యార్థుల పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో చాటి చెప్పారు మార్టిన్ లూథర్ కింగ్. పాత తరం ఆలోచనలు, భయాలు లేదా రాజీ ధోరణులను అధిగమించి, సమాజంలో స్తబ్దతను ఛేదించే ధైర్యం విద్యార్థులకు మాత్రమే ఉంటుందన్న నగ్న సత్యాన్ని ప్రపంచానికి చాటింది కూడా మార్టిన్ లూథర్ కింగే. తెలంగాణ ఉద్యమం కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జోక్యంతో తారాస్థాయికి చేరిన అంశం అక్షర సత్యం. ఇప్పుడు ఢిల్లీ లో జరుగుతున్న సీజేపీ ఉద్యమం కూడా అచ్చం ఈ దిశలోనే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ లోని జంతర్ మంతర్ లో చేస్తున్న నిరసనలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది సీజేపీ నిరసన. కాక్రోచ్ జనతా పార్టీ ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తుందనేది బీజేపీ నేతలను తొలుస్తున్న ప్రధాన ప్రశ్న. ఎన్నో ఏళ్తుగా పరిష్కరించలేని చిక్కుముడిలా పరిణమించిన సమస్యలను అతిసునాయసంగా ఛేదించిన బీజేపీ మేధావులకు సీజేపీ ని ఏ విధంగా డీల్ చేయాలనే అంశంలో మాత్రం అయోమయానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. సీజేపీ కార్యవకర్తల పైన విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేయించి బీజేపీ మూల్యం చెల్లించుకునే ప్రమాదంలో పడిందని రాజకీయ విశ్లేషకు నిర్ధారిస్తున్నారు. పొలిటికల్ టార్గెల్ లేకుండా ఆవిర్బవించిన కాక్రోచ్ జనతా పార్టీకి బీజేపీ టార్గెట్ గా మారిందనే చర్చ కూడా జరుగుతోంది. జెంజీ ఊపుతో, ఉడుకు రక్తంతో ఉరకలేస్తున్న సీజేపీ ఆగ్రహానికి బీజేపీ బలవ్వక తప్పదనే సరికొత్త చర్చ కూడా వినిపిస్తోంది.

కృష్ణహరి. సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *