(న్యూస్ఇన్,హైదరాబాద్)
గ్రేటర్ లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కు గులాబీ పార్టీలో పాల మలన్న కోడలు ప్రీతిరెడ్డి పొగపెడుతోంది. వివేక్ పోటీ చేసి విజయం సాధిస్తున్న కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న సంకేతాలు ఇస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్లకు పైగా సమయం ఉంది. తన కార్యక్రమాలు, కళాశాలల నిర్వహణ, మామ మల్లారెడ్డి ప్రోత్సహాంతో ఆయన కోడలు ప్రీతిరెడ్డి చూసుకుంటూనే రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మేడ్చల్ నియోజకవర్గానికి అత్యంత సమీపంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు మొదలు పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో తమ వర్గాన్ని ప్రోత్సహించుకుంటూ వచ్చే ఎన్నికలపై ప్రీతి ఫోకస్ పెంచుతుండడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్యే వివేక్ తో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన మూడో కొడుకు అని చెప్పుకునే కోడలు ప్రీతిరెడ్డికి కుత్బుల్లాపూర్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. తన పరిచయాలు అవకాశాన్ని సృష్టించుకునే ప్రయత్నాలు చేయడం రాజకీయంగా దూమారం రేపుతోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో గులాబీ నేతలు ఆ ఫ్లెక్సీలను చింపేశారు. కుత్బుల్లా పూర్ లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ లో స్థానం లేదన్న సంకేతాలు ఇచ్చారు. ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి సీరియస్ కావడం విశేషం. తన కోడలు స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీలను చించిన ఘటన కు స్థానిక ఎమ్మెల్యే వివేకాందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులదే బాధ్యత వహించలన్నారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ… ఆ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్ లను తప్పు బట్టడంపై ఎన్నో అనుమానాలు రాజకీయంగా మొదలయ్యాయి.
మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం దాదాపు మూడేళ్లుగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలను మల్లన్న తప్పుబడుతుండడంతో..ఇక ఆయన గులాబీ పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నానన్న సంకేతాలు ఇస్తున్నారా ? అన్న చర్చ మొదలైంది.ప్రీతిరెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మామ కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ గుర్తు కూడా లేదు. దీంతో నేతల్లో ఉన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని బర్త్ డే సందర్భంగా ప్రీతిరెడ్డి ప్రకటించారు. ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న విషయాన్ని కూడా ప్రీతిరెడ్డి సస్పెన్స్ లో ఉంచుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానన్న ఆమె వ్యాఖ్యానించకపోవడం విశేషం. గతంలో ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రీతిరెడ్డి ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. అనంతరం ఢిల్లీలో కుటుంబం మొత్తం ప్రధానిని కలిసి వచ్చారు. ఆ తరువాత బీజేపీ కార్యాలయానికి ఆమె వెళ్లారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాననే ప్రకటన ఆమె చేయకపోవడం కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం మల్లారెడ్డి విద్యా సంస్థల అక్రమాలపై ప్రభుత్వ దాడులు చేసిన సమయంలో బెంగుళూరు వెళ్ళి నుంచి ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శివకుమార్ ద్వారా వ్యవహారాలను చక్కబెట్టుకున్న మల్లారెడ్డి కుటుంబం కాంగ్రెస్ లో కూడా తలుపులు కొట్టేందుకు అవకాశం ఉంచుకుంది.

మల్లారెడ్డి బీఆర్ఎస్ నేతలను తప్పు బట్టడం…పోటీ చేస్తానని ప్రకటించిన ప్రీతిరెడ్డి ఏ పార్టీ అని తేల్చుకోలేదా అన్న ప్రశ్నలు ఇ మొదలవుతున్నాయి. ఇప్పటికే మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజేశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక మరో నేత కూడా ఆ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటే బీఆర్ఎస్ ఎంత వరకు సహకరిస్తుందన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.2019 ఎన్నికల్లో పట్టుబట్టి అల్లుడికి ఎంపీ టికెట్ దక్కించుకున్న మల్లారెడ్డి చేసిన తప్పుటడుగులతో సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఊపిరి పోసినట్లయిందన్న చర్చ కూడా ఉంది. ఆ సమయంలో మల్లారెడ్డి వ్యవహారంపై ఆగ్రహంతో పలువురు గులాబీ నేతలు పూర్తి స్థాయిలో సహకరించలేరన్న వాదన కూడా ఉంది.వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురు ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తారా….. ముగ్గురు మూడు దారులు వెతుక్కుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.












Leave a Reply