(న్యూస్ఇన్, హైదరాబాద్)
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎవరెవరికి అక్రమ భూములు ఉన్నట్టు వెల్లడించారో ఆ భూములపై సీబీఐ విచారణ జరిపించాలని టీఆర్ ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దీనిపై సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. అసెంబ్లీలో ఈరోజు సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ గారి ఫాం హౌస్ లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
తాను ఎప్పటి నుంచే చెబుతున్నట్లు గుంపు మేస్త్రీ – గుంటనక్క కలిసే ఉన్నారని మరోసారి ఆరోపించారు. ఇద్దరు కలిసే ఈ డ్రామాలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. తాను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న భూమి కన్నా గజం అదనంగా ఉన్నట్టు తేలినా ఆ భూములు ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని కవిత కూడా ప్రకటించారు.












Leave a Reply