(హైదరాబాద్,న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రైతులకు అందవని, నీటిని ఎత్తిపోస్తే అందుతాయని మాజీ మంత్రి హరీష్ రావ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ కరువే అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో నీళ్ల కరువు, ఎరువుల కరువు, పథకాల అమలు కరువు, అభివృద్ధి కరువు అని వ్యాఖ్యానించారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద పట్టిసీమకు నీళ్లు వదులుతున్నారని ఆరోపించారు. దేవుళ్ల మీద ఓట్లు వేసి సీఎం మాట తప్పడంతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందన్నారు. చిన్నకోడురు రైతులు నిర్వహించిన పాదయాత్రలో హరీష్ రావ్ పాల్గొన్నారు. అనంతగిరి, రంగనాయక సాగర్ లు కాళేశ్వరం నీటితో నింపాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర నిర్వహించారు. ఈ రైతు యాత్ర బీఆర్ ఎస్ నిర్వహించలేదని, రైతులు పాదయాత్రను చేస్తే బీఆర్ ఎస్ పాల్గొందని హరీష్ రావ్ చెప్పారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరువాలని లేని పక్షంలో అన్ని మండలాల నుంచి ఇదే మాదిరిగా పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ పై కోపంతోనే రేవంత్ రెడ్డి ఆ నీటిని ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. ఈ రోజు రంగనాయక సాగర్ చూస్తే మొత్తం చిన్నబోయిందని గుండ్లు రాళ్లు, తాడిచెట్లన్ని మళ్ళీ కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎం గా ఉన్న 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఏనాడు కరువు రాలదన్నారు. మరో రెండు వారాల్లో మేడి గడ్డ దగ్గర రెండు లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తాయని, అప్పుడన్న మోటర్లు ఆన్ నీళ్ళు ఎత్తిపొయాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లిలో నీళ్ళు లేకపోతే NTPC , సింగరేణి ధర్మల్ విద్యుత్ లో కరెంట్ ఆగిపోతుంది, హైదరాబాద్ లో తాగేందుకు మంచినీళ్లు ఉండవు ప్రజలు వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.












Leave a Reply