NewsInn

News in a Click

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంపర్ ఆఫర్

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తమ కుటుంబానికి రూ.లక్ష కోట్ల విలువైన భూములు ఉన్నాయంటూ చేస్తున్న ప్రచారంపై సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన సవాల్‌ విసిరారు. తమ పేరుతో ఉన్న ఆస్తులన్నింటినీ రాసిస్తామని, రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు వేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

రేవంత్ చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్‌ ఇస్తున్నా. మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై నీకు ఓ సవాల్‌ విసురుతున్నా. మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం.. రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.
తెలంగాణలోని పేద ప్రజల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు వేస్తానంటే తమ పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తామని కేటీఆర్ అయ‌య‌లిఎ. అలా చేయలేకపోతే తనపై చేస్తున్న ప్రచారాన్ని ఇకనైనా ఆపి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పిచ్చి ప్రచారాన్ని మానుకుని క్షమాపణ

కేసీఆర్‌ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ ఉందంటూ ఇంతకాలం చేసిన ప్రచారం బెడిసికొట్టడంతో ఇప్పుడు లక్ష కోట్ల భూములంటూ కొత్త ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని రేవంత్‌రెడ్డే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీల అమలు విషయంలో జరిగిన మోసాల నుంచి, 22ఏ భూముల అంశం నుంచి నాలుగు కోట్ల మంది ప్రజల దృష్టిని ఇలాంటి ఆరోపణలతో మళ్లించలేరన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *