NewsInn

News in a Click

న‌ల్గొండ‌లో సీఎం టూర్- కాంగ్రెస్ నేత‌ల అరెస్టులు

న‌ల్గొండ‌లో సీఎం టూర్- కాంగ్రెస్ నేత‌ల అరెస్టులు

(న‌ల్గొండ‌,న్యూస్ఇన్‌)

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి న‌ల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న జిల్లా కాంగ్రెస్ లో రాజ‌కీయ దూమారం రేపుతోంది. కాంగ్రెస్ నేత‌ల్లో ఉన్న విబేధాలు మ‌రో సారి బ‌య‌ట‌ప‌డ్డాయి. అధికార పార్టీ నేత‌ల్లో అసంతృప్త రాగాన్ని చ‌ల్ల‌ర్చేందుకు ఈ సారి సీఎం ప‌ర్య‌ట‌న కావ‌డంతో పోలీసులు రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు. అసంతృప్త రాగం తీస్తున్న నేత‌ల‌ను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయ‌డం మొద‌లు పెట్ట‌డం రాజ‌కీయంగా హాట్ హాట్ గా మారింది. జిల్లాలో కాంగ్రెస్ కు తిరుగులేద‌ని చెబుతున్నా….గ్రూప్ త‌గాదాల్లో కూడా త‌మ‌కు సాటి ఎవ‌రు లేర‌న్న విధంగా కాంగ్రెస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం హాట్ హాట్ గా మారుతోంది. జిల్లాల్లో హ్యాం రోడ్ల శంకుస్థాప‌న‌కు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు న‌ల్గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం ప‌ర్య‌ట‌న ఉండ‌డంతో ఉద‌యం నుంచి జిల్లా పోలీసులు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కంటే అధికార పార్టీ నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డం కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

డీసీసీ వర్సెస్ మంత్రి…..

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష‌డు కైలాస్ నేత కు ఆహ్వానం అంద‌క‌పోవ‌డం విశేషం. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కైలాస్ ను హాజ‌రు కావ‌ద్ద‌ని స్స‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో జిల్లా కాంగ్రెస్ నేత ఫోటోలు కూడా పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌కు హాజ‌రు కావ‌ద్ద‌ని మంత్రి స్ప‌ష్టం చేస్తున్నా……కైలాస్ మాత్రం ఖ‌చ్చితంగా సీఎం ప‌ర్య‌ట‌న‌లో తాను పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో అధిష్టానం డీసీసీ అధ్య‌క్షుడికి ఏ స్థాయిలో ప్రాధాన్య‌త ఇస్తుందో తెలిసిపోతుంద‌న్న చ‌ర్చ కాంగ్రెస్ నేత‌ల్లో వినిపిస్తోంది.

రాజ‌గోపాల్ రెడ్డి వ‌ర్సెస్ సీఎం…..

మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి అనుచ‌రుల‌ను సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు అరెస్టు చేయ‌డం రాజ‌కీయంగా దూమారం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కార‌ణంగానే త‌మ నేత‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం లేద‌ని రాజ‌గోపాల్ రెడ్డి వ‌ర్గం నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం స‌భ‌కు హాజ‌రై నిర‌స‌న తెలిపే అవ‌కాశం ఉంద‌న్న అనుమ‌నాంతో పోలీసులు మునుగోడు స‌హా ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న రాజ‌గోపాల్ రెడ్డి అనుచ‌రుల‌ను అరెస్టు చేయ‌డం రాజ‌కీయంగా హాట్ హాట్ గా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే త‌న అనుచ‌రుల అరెస్టుపై ఎలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది.

గుత్తా వ‌ర్సెస్ అధికారులు…..

ఇక అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరు ఇక్క‌డ మ‌రో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గా ఉన్న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ప్రోటో కాల్ ప్రకారం వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డంతో గుత్తా కూడా సీరియ‌స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. సీఎం ప‌ర్య‌ట‌న అనంత‌రం మండ‌లి చైర్మ‌న్ గా సంబంధిత అధికారుల వ్య‌వ‌హారంపై గుత్తా దృష్టి సారించే అవ‌కాశం ఉంది. జిల్లాల్లో ఇప్ప‌టికే ప్రోటోకాల్ ర‌గ‌డ జ‌రుగుతున్న నేప‌థ్యంలో మండ‌లి చైర్మ‌న్ కు స్వ‌యంగా ప్రోటోకాల్ లో చేదు అనుభ‌వం ఎదురు కావ‌డాన్ని సీరియ‌స్ గా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

హైద‌రాబాద్ లో టీడీపీ ఎంపీ భూ కబ్జా య‌త్నాలు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *