NewsInn

News in a Click

RAJASTHAN ROYALS పై DC సునాయ‌స విజ‌యం

RAJASTHAN ROYALS పై DC సునాయ‌స విజ‌యం

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌)

భారీ స్కోరు న‌మోదైన మ్యాచ్ లో మారోసారి ఛేజింగ్ జ‌ట్టు విజ‌యం ద‌క్కించుకుంది. 226 ప‌రుగుల ల‌క్ష్యంగా బ‌రిలో దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్ ఆర్ పై సునాయ‌స విజ‌యం ద‌క్కించుకుంది. ఓపెనర్ల నుంచి చివ‌రి బ్యాట్సె మెన్ వ‌ర‌కు అంతా రాణించ‌డంతో ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకుంది.అసుతోష్, స్టబ్స్ లు ఆర్ ఆర్ బౌల‌ర్ల‌పై భారీ షాట్లు ఆడుతూ జ‌ట్టును విజ‌యం వైపు న‌డిపించారు. స్ట‌బ్స్ 11 బంతుల్లో 18 ప‌రుగులు, అసుతోష్ 15 బాల్స్ ఎదుర్కొని 26 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఢిల్లీని గెలిపించారు. 7 వికెట్ల తేడాతో ఆర్ ఆర్ పై విజ‌యం ద‌క్కించుకుంది.

భారీ స్కోరు ఛేద‌న‌లో భాగంగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ మొద‌టి బంతి నుంచే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై విరుచుకు ప‌డింది. ఢిల్లీ ఓపెన‌ర్లు జ‌ట్టుకు మంచి శుభారాంభాన్ని అందించారు. పాతుం నిశాంక‌, కే.ఎల్. రాహూల్ లు రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌కు ఎక్క‌డా అవ‌కాశం ఇవ్వ‌కుండా భారీగా ప‌రుగులు రాబ‌ట్టుకున్నారు.

ప‌వ‌ర్ ప్లేలోనే భారీగా ప‌రుగులు చేయ‌డంతో జ‌ట‌య‌టు విజ‌యానికి బాట‌లు వేసేలా ఇన్నింగ్స్ మొద‌లు పెట్టారు. నిశాంక జోరుగా బ్యాటింగ్ చేస్తుండ‌డంతో కేఎల్ రాహూల్ ఫాంలో ఉన్నా…నిశాంక బ్యాటింగ్ చేసేందుకే ఎక్కువ‌గా అవ‌కాశం ఇచ్చారు. ఈ అవ‌కాశాన్ని పాతూం నిశాంక‌ కూడా స‌ద్వినియోగం చేసుకున్నారు. 10వ ఓవ‌ర్ వ‌ర‌కే ఢిల్లీ స్కోరు 110 ప‌రుగుల‌కు చేరుకుంది. అక్క‌డ పాతూం నిశాంక రూపంలో తొలి వికెట్ ఢిల్లీ కోల్పోయింది. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ ల‌తో 62 ప‌రుగులు చేసి వెనుదిరిగారు.

ఆ తరువాత బ్యాటింగ్ కు వ‌చ్చిన నితీష్ రాణా కూడా ఆర్ ఆర్ బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు. రాణా- రాహూల్ లు జ‌ట్టు స్కోరును వేగంగా ముందుకు తీసుకెల్లారు. 17 బాల్స్ ఎదుర్కొన్న రాణా 3 ఫోర్లు, 2 సిక్స్ ల స‌హాయంతో 33 ప‌రుగులు చేసి171 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యారు. మ‌రో వైపు క్రీజులో నిల‌దొక్కుకున్న కేఎల్ రాహూల్ కూడా భారీ స్కోరు సాధించారు. దీంతో ఢిల్లీ విజ‌యం కోసం చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో 53 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. 40 బాల్స్ ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్స్ ల స‌హాయంతో 75 ప‌రుగులు చేసి 16 వ ఓవ‌ర్లో వెనుదిరిగారు. విన్నింగ్ ఇన్నింగ్ రాహూల్ ఆడుతార‌ని భావించినా స్కోరు పెంచే ప్ర‌య‌త్నంలో సులువైన క్యాచ్ ఇచ్చి ఆర్చ‌ర్ బౌలింగ్ లో ఔట‌య్యారు. 178 ప‌రుగుల వ‌ద్ద 3వ వికెట్ డీసీ కోల్పోయింది. స్ట‌బ్స్, అసుతోష్ లు కొత్త బ్యాటర్లు క్రీజులోకి రావ‌డంతో ఆర్ ఆర్ బౌల‌ర్లు వారిపై వ‌త్తిడి పెంచి ప‌రుగులు అడ్డుకునే య‌త్నం చేశారు. మ్యాచ్ లో ఢిల్లీ బ్యాట‌ర్లు నిల‌దొక్కోవ‌డంతో విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా క‌నిపించింది. కాని చివ‌రి నాలుగు ఓవ‌ర్ల‌లో 24 బంతుల్లో 42 ప‌రుగుల టార్గెట్ కావ‌డంతో మ్యాచ్ ఆస‌క్తి క‌రంగా మారింది.

ఆర్ఆర్ జ‌ట్టు చివ‌రి ఓవ‌ర్ల‌లో భారీ ప‌రుగులు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *