NewsInn

News in a Click

ఏకాదశికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

ఏకాదశికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఆషాఢ ఏకాదశి వేడుకల సందర్భంగా పండరీపురం వెళ్లే భక్తుల రద్దీని నియంత్రించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) మూడు జతల ప్రత్యేక రైళ్లను జులై 24, 25 తేదీల్లో నడుపుతోంది. నాగర్‌సోల్ – పండరీపురం – జల్నా, ఆదిలాబాద్ – మీరజ్, అకోలా – పండరీపురం మార్గాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలో ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు రైళ్ల సమయాలు, స్టాప్‌లు, రిజర్వేషన్ వివరాలను ముందుగానే పరిశీలించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *