NewsInn

News in a Click

దిగజారుతున్న టీవీ చర్చలు..రాజకీయ ఎజెండాలు అమలు

దిగజారుతున్న టీవీ చర్చలు..రాజకీయ ఎజెండాలు అమలు

తెలుగు రాష్ట్రాల్లో టీవీ చర్చలపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. పార్టీల వారీగా తమ బాధలను వినిపించే విధంగా టీవీ చర్చలు జరుగుతున్నాయి అన్న చర్చ సామాన్య ప్రజలు వినిపిస్తుంది. తాజాగా ఓ టీవీ ఛానల్ లో చూపు చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా వైసిపి నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి.

భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఇదేనా.? రాజకీయాల పట్ల గానీ, రాజకీయ నాయకుల పట్ల గానీ కనీస పరిజ్ఝానం లేని అతి సామాన్యులను తీసుకొచ్చి లైవ్ డిబేట్ లో ఎలా కూర్చోబెడతారు? రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఛానల్ లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాస రావు చర్చా వేదికలో ఒక వైసీపీ పార్టీ అభిమాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు పూర్తి అర్థరహితం. అసలు తెలంగాణ రాజకీయాల పట్ల గానీ, తెలంగాణ సీఎం గురించి గానీ ఆ ఛానల్ లో ఆ సమయంలో చర్చ పెట్టడం ఆక్షేపణీయం. చర్చ పెట్ట దలుచుకుంటే సబ్జెక్ట్ తో సహా ఆమోదయోగ్యమైన వివరణ ఇస్తూ డిబేట్ లో పాల్గొంటే శ్రేయస్కరంగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డిని జుమోటో బాయ్ తో పోల్చుతూ, జీవో కూడా చదవరాదంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేసే వాడికి అంత ఎయిర్ టైమ్ ఎలా ఇస్తారు.? చర్చను నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాస రావు అయోమయంలో నుంచి తేరుకునేలోపే నాగార్జున అనే శాడిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ని అనకూడని మాటలు అన్నీ అనేసాడు. కొమ్మినేని గారికి నాగార్జున ఏం మాట్లాడుతున్నారు.? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో కూడా పసిగట్ట లేకుండా వ్యవహరించడం మరీ విడ్డూరం.

Sakshi tv discussion

యాంకర్ అనే వాడు లైవ్ డిబేట్ లో అంత ఏమరుపాటుగా వ్యవహరించడం మొదటిసారి చూసి ఆశ్చర్యమేసింది. చూపు మందగించినా, వినికిడి శక్తి తగ్గినా కొమ్మినేని గారు టీవీ డిబేట్ల నుండి విశ్రాంతి తీసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. చర్చలో పాల్గొనేందుకు జూమ్ లోకి వచ్చిన నాయకులు ఏం మాట్లాడుతున్నారో కూడా సోయి లేకుండా వ్యవహరించడం అత్యంత దారుణం. తాను నడిపించే టీవీ పోలిటికల్ షో పైన తనకే నియంత్రణ లేకపోవడం దారుణాతి దారుణం. ఎవరో అనామకుడిని,అర్చకుడిని తీసుకొచ్చి డిబేట్ లో కూర్చోబెట్టి సీఎం రేవంత్ రెడ్డిని ఇష్టారీతిన దుర్బాషలాడించడం ఏమాత్రం సమంజసం కాదు. నాగార్జున అనే వాడు ఎవడు అసలు.? సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత, నైతికత అతనికి ఉందా? నాగార్జున మాట్లాడిన భాష ఎంటి? అతని స్థాయి ఏంటి.? సీఎం స్థాయికి చేరుకోవడం, సీఎం పదవి చేపట్టడం అంటే ఎంత శ్రమించాల్సి ఉంటుంది? ఎన్ని ఆటుపోట్లను అధిగమించాల్సి ఉంటుంది.? రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించి అంతర్గతంగా, బహిర్గతంగా ఎంత సాహసోపేతమైన అడుగులు వేయాల్సి ఉంటుందో తెలియని సన్నాసులతో టీవీ పొలిటికల్ డిబేట్లలో కూర్చోబెడతారా.? ఈ ప్రశ్నకు కొమ్మినేని సమాధానం చెప్పగలరా.? ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ని టీవీ డిబేట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నాగార్జున గురించి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పెదవి విప్పడం లేదు ఎందుకని.? కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఏమయ్యారు.? కార్పొరేట్ ఛైర్మన్లు ఏమయ్యారు.? నిన్నటి దాకా నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు ఏమయ్యారు.? ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ విభాగాలు ఎక్కడకు వెళ్లాయి.? నాగార్జున కు వ్యతిరేకంగా గానీ, కొమ్మినేని గురించి గానీ ఎక్కడా ఒక్క నిరసన కార్యక్రమం కూడా ఎందుకు నిర్వహించలేక పోయారు.? అసలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏం చేస్తున్నట్టు.? పక్క రాష్ట్రానికి సంబంధించిన మీడియా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని అనకూడని మాటలు అంటుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా మొద్దు నిద్ర పోతుందా.? కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా ఉందా చచ్చిపోయిందా అనిపిస్తుంటుంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగార్జునను అదుపులోకి తీసుకుంటే సరిపోతుందా.? సీఎం గౌరవానికి భంగం కలుగుతున్నప్పుడు పార్టీ గొంతు బలంగా వినిపించాల్సిన అవసరం లేదా.? ప్రతి సమస్యను సీఎం రేవంత్ రెడ్డే అడ్రస్ చేయలేరు కదా? ప్రజలకిచ్చిన హామీలు, రాష్ట్రాభివృద్ది తదితర అంశాలు సీఎం చూసుకుంటున్నారు. మిగతా అంశాలు చూసుకోవాల్సింది నాయకులే కదా.? మరి అలాంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఏమయ్యింది.? అధికారంలోకి రాగానే, పదవులు రాగానే గొంతులు మూగబోయాయా.? ఇంత జరుగుతున్నా పార్టీ నాయకుల్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యం.? స్వయంగా ముఖ్యమంత్రిని నిందిస్తున్న వ్యక్తులను, వ్యవస్థలను ఎదిరించకుండా ఉండేంత రాచకార్యాలు ఏముంటాయి నాయకులకు.? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక టీమ్ ను సెట్ అప్ చేసిన తర్వాత తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి సెట్ అప్ చేసిన టీమ్ కూడా వారి కార్యక్రమాలను వారు విజయవంతంగా నిర్వహించాలి కదా.? ఇంత పేలవంగా ఉంటే వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేది ఎట్ల.? హరీష్ రావు ఏదో అన్నడు.. కేటీఆర్ ఏదో మాట్లడాడు.. కౌంటర్ ఇస్తే సరిపోతుందనే కాస్మోటిక్ పాలిటిక్స్ చేస్తే సరిపోదనే అంశాన్ని ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రహించాలి. సమస్యలను అదిగమించి మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న మొద్దు నిద్రను వీడాల్సిందే. లేదా సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే కఠిన నిర్ణయాలను ఆమోదించాల్సిందే..!!

కృష్ణహరి. డి. స్పెషల్ కరెస్పాండెంట్,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *