NewsInn

News in a Click

కింగ్ నాగార్జునకు సీడ్ గణేష్

కింగ్ నాగార్జునకు సీడ్ గణేష్

(న్యూస్ఇన్,హైదరాబాద్)

ప్రముఖ నటుడు కింగ్ నాగార్జున కు ఆన్నపూర్ణ స్టూడియో లో గ్రీన్ గ్రీన్ ఛాలెంజ్ సభ్యులు సీడ్ గణేష్ ను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా భక్తిని పర్యావరణ పరిరక్షణతో మేళవించి సీడ్ గణేష్ ను పంపిణీ చేస్తున్నారు.విగ్రహాన్ని స్వీకరిస్తూ నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ దార్శనికతను హృదయపూర్వకంగా అభినందించారు. ఆరాధనను శాశ్వత పర్యావరణ మేలుగా మార్చే ఈ కృషిని ఆయన ప్రశంసించారు. సీడ్ గణేశను సమయోచితమైన, అర్థవంతమైన కానుకగా అభివర్ణిస్తూ, నదులు, చెరువులు, జలాశయాలపై భారం పడకుండా వినాయకుని పూజించేందుకు ఇది మార్గం చూపుతుందన్నారు.సహజ మట్టి, కోకోపీట్, కొబ్బరి నారతో తయారై, వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలు పొదిగిన సీడ్ గణేశను ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చు. పూజా కార్యక్రమాల తర్వాత విగ్రహం మట్టిలో కరిగిపోయి, విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా రూపొందుతాయి. వాటిని ఇంటి ఆవరణలు, ఉద్యానవనాలు, సామూహిక స్థలాల్లో నాటవచ్చు. ఈ విధంగా భక్తి మొక్కగా మారుతుంది; వినాయకుని ఆశీస్సు పచ్చదనంగా కొనసాగుతుంది.2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితహారం స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు.

మూడు మొక్కలు నాటండి, మూడు సంవత్సరాలు సంరక్షించండి, మరో ముగ్గురిని నామినేట్ చేయండి. మహమ్మారి కాలంలో ప్రవేశపెట్టిన సీడ్ గణేశం ఈ ఉద్యమంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగ కార్యక్రమంగా మారింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల స్థానంలో, భూమికి తిరిగి ప్రాణంగా మారే రూపాన్ని భక్తులు స్వీకరించాలని ఇది పిలుపునిస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో విగ్రహాన్ని స్వీకరించి, శ్రీ సంతోష్ కుమార్ నిరంతర ప్రజాసేవను బహిరంగంగా గుర్తించిన నాగార్జునకు GIC బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సీజన్‌లో సీడ్ గణేశను సినీ ప్రముఖులు, కుటుంబాలు, సంస్థలు స్వీకరించాలని సంస్థ పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *