NewsInn

News in a Click

గుంపు మేస్త్రీ – గుంట నక్క కుమ్మక్కు – కవిత సంచలన ఆరోపణలు

గుంపు మేస్త్రీ – గుంట నక్క కుమ్మక్కు – కవిత సంచలన ఆరోపణలు

(న్యూస్ఇన్,హైదరాబాద్).

గుంపు మేస్త్రీ – గుంటనక్క కుమ్మక్కయారని టిఆర్ఎస్ చీఫ్ కవిత ఆరోపించారు. సిద్దిపేటలో నిషేధిత జాబితాలో ఉన్న వంద ఎకరాల భూమిని హరీశ్ రావు తన తండ్రి, కుటుంబ సభ్యుల పేరు మీదకు బదలాయించాడని దానిపై చర్యలు తీసుకునే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని సవాల్ విసిరారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి సామ్రాట్.. బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు అని కవిత ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులు, మిత్రమండలి, అవినీతిలో రాటుదేలిన మంత్రులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో తనకు కమీషన్లు ఎందుకంటూ కమల్ హాసన్ లెవల్ లో ఏకపాత్రాభినయం చేస్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకున్నారని అన్నారు. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన చరిత్రను ప్రజలు మర్చిపోరని అన్నారు.

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్..

రేవంత్ రెడ్డి అవినీతిలో మునిగిపోయిన సామ్రాట్ అని కవిత విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకోని రియల్టర్లను బెదిరిస్తే…ఇప్పుడు అధికారంలో ఉండి కుటుంబ సభ్యులు, మంత్రి మండలి మిత్రులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బ్లాక్ మెయిలర్ల సంఘం పెడితే దానికి రేవంత్ రెడ్డే అధ్యక్షుడవుతారన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఆంధ్రా వ్యక్తులతో కలిసి క్యాష్ తో డీల్ చేసి అడ్డంగా దొరికిందెవరు? అని కవిత ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు నుంచే బ్లాక్ మెయిలింగ్ తో అడ్డంగా అక్రమాలకు పాల్పడిన చరిత్ర రేవంత్ ది అన్నారు. అలాంటి వ్యక్తికి అధికారం రావటంతో అవినీతిలో రాటుదేలిన మంత్రులతో కలిసి ఇప్పుడు రాచమార్గంలో అవినీతి సామ్రాజ్యం నిర్మిస్తున్నారన్నారు. అసెంబ్లీలో తనకు కమీషన్ల అవసరమేంటనీ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అవినీతి కోసం అటు బీఆర్ఎస్ తో, ఇటు బీజేపీ తో దోస్తానా చేస్తున్నాడని కవిత ఆరోపించారు. ముఖ్యంగా గుంటనక్కతో గుంపు మేస్త్రీ కుమ్మక్కయ్యాడని చెప్పారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కాంగ్రెస్ కన్నా ఎక్కువగా దోచుకున్నారని కవిత ఆరోపించారు.ఆ పార్టీ నాయకులకు ప్రజల కోసం పోరాటం చేయాలన్న సోయి లేకుండా పోయిందని విమర్శించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి తన గొప్పులు చెప్పుకుంటూ సభను తన ప్రచారం కోసం వాడుకుంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

కొడంగల్ వేదికగా రేవంత్ చిట్టా బయటపెడతా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి పాపాల చిట్టాను కొడంగల్ వేదికగా బయటపెడతామని కవిత అన్నారు. ఈ నెల 20 న కొడంగల్ లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నామన్నారు. అదే రోజు కొడంగల్ వేదికగానే ముఖ్యమంత్రి అవినీతిని ప్రజలు ముందు పెడతామని కవిత చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *