
(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కోతలను.. అధికమించి 24 గంటల కరెంటు ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తాం
తెలంగాణకు 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆరే…హైదరాబాద్ 24 గంటలు తాగునీరు ఇచ్చేది కూడా కేసీఆరే అని కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసింది ఏమీ లేదన్నారు.
గత ప్రభుత్వం కట్టిన ఫ్లై ఓవర్లు, ఆసుపత్రులు, భవనాలను ఓపెన్ చేస్తూ మేమే చేశామని కాంగ్రెస్ అబద్ధాలు చెప్పుకుంతుందన్నారు.
గతంలో కేవలం అభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెట్టామని,కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి అండగా ఉన్న కార్యకర్తకు నాయకుడికి ప్రతి ఒక్కరికి తగిన అవకాశం గౌరవం కల్పిస్తామని చెప్పారు.
SIR పై ప్రజెంటేషన్…
కాంగ్రెస్, బిజెపి నమోదు చేసిన దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని,ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు.అసెంబ్లీ ఎన్నికలప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. హైదరాబాద్ నగరానికి రెండున్నర సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ నగరానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు.

సభ్యత్వ నమోదు..
ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ రూపంలోనే నిర్వహించబోతున్నదని సభ్యత్వ నమోదుకు సంబంధించిన.. కార్యక్రమం, కమిటీల ఏర్పాటు దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ పార్టీ తరఫున ఇస్తామని తెలిపారు.








Leave a Reply