ప్రియమైన కార్మిక సోదర, సోదరీమణులకు..
మన సంస్థ ప్రయాణికుల సేవే పరమావధిగా పనిచేస్తోంది. ఇటీవల వివిధ యూనియన్లు ఇచ్చిన సమ్మె నోటీసులపై స్పందిస్తూ, కార్మిక శాఖ మరియు యాజమాన్యం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీతో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ఈ తరుణంలో కార్మికులందరూ ఈ క్రింది ముఖ్యమైన చట్టపరమైన అంశాలను గమనించాలని యాజమాన్యం కోరుతుంది.
చట్టపరమైన నిబంధన….

పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 22(1)(d) ప్రకారం, సంబంధిత అధికారి (Conciliation Officer) వద్ద ఒక వివాదం పెండింగ్లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం.
ప్రస్తుత స్థితి…..
జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారి వద్ద ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ ముగియకముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా చెల్లదు.
క్రమశిక్షణ చర్యలు…..
చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొనడం వల్ల వేతన కోతతో పాటు, ఉద్యోగ నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కార్మికుల భవిష్యత్తుపై మరియు వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
యాజమాన్యం విజ్ఞప్తి…..
సంస్థ మరియు కార్మికుల సంక్షేమం దృష్ట్యా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, సంస్థ ప్రతిష్ఠను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కావున, కార్మికులు మరియు యూనియన్ నాయకులు, పత్రికలు లేదా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక పిలుపులను నమ్మవద్దు.
సిబ్బంది సమ్మెను విరమించుకుని, అందరూ యథావిధిగా తమ విధులకు హాజరు కావాలని యాజమాన్యం కోరుతుంది.
మన సంస్థను కాపాడుకుందాం –ప్రజల రవాణా సౌకర్యాన్ని నిరంతరాయంగా కొనసాగిద్దాం…!




Leave a Reply