NewsInn

News in a Click

ఆర్టీసీ సమ్మెకు బిఅర్ఏస్ మద్దతు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భారత రాష్ట్ర సమితి నైతిక మద్దతు తెలుపుతుందని కేటీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న ప్రతి డిమాండ్ న్యాయమైనదేనని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే, దానిని ఇప్పటిదాకా అమలు చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. వారికి వెంటనే అపాయింట్‌మెంట్ డేట్ ప్రకటించాలని, పీఆర్సీతో పాటు డీఏలు, ఇతర బకాయిలు చెల్లించాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశాలను ఇప్పుడు పట్టించుకోకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. క్యాబినెట్ సమావేశం పెట్టుకొని కేవలం డబ్బుల పంపిణీ పైన కాకుండా, ఆర్టీసీ సమ్మె వంటి ప్రజా సమస్యలపై చర్చించాలని కేటీఆర్ సూచించారు. మేనిఫెస్టో ఉన్న అర్టిసీ కార్మికులకు హమీల గురించి, తొటి మంత్రి శ్రీధర్ బాబును అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. మూడు బడ్జెట్లు అయిపోయిన తర్వాత కూడా మేనిఫెస్టోలో ఏం రాశారో తెలియకపోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె హ‌రీష్ కుట్ర‌….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *