NewsInn

News in a Click

ఒక వైపు చ‌ర్చ‌లు- మరో వైపు ఉద్రిక్త‌త‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఆర్టీసి కార్మికుల స‌మస్య‌ల‌పై ఒక వైపు ప్ర‌భుత్వం స‌చివాల‌యంలో చ‌ర్చ‌లు జరుపుతోంది.మ‌రో వైపు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డ డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ అంత్య క్రియ‌ల విష‌యంలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంటుంది. గ‌త ఆర్ధ‌రాత్రి నుంచి ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. రాత్రి 10.30 గంట‌ల ప్రాంతంలో శంక‌ర్ గౌడ్ మృతి చెందార‌న్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. కానీ ఒంటి గంట ప్రాంతంలో వైద్యులు 80 శాతం కాలిన గాయాల‌తో చికిత్ప పొందుతున్నార‌ని స‌మాచారం ఇచ్చారు తెల్ల వారే స‌రికి డ్రైవ‌ర్ మృతి చెందార‌ని స‌మాచారం ఇచ్చారు.ఈ ఘ‌ట‌న‌ను కార్మిక సంఘాల‌తో పాటు, రాజ‌కీయ పార్టీలు కూడా సీరియ‌స్ గా ప‌రిగ‌ణిస్తున్నాయి. శంక‌ర్ గౌడ్ మృతి కి ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల‌ని హెచ్చిస్తున్నాయి. పోస్టు మార్టం అనంత‌రం ఆయ‌న మృత దేహాన్ని త‌ర‌లింపు విష‌యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తున్నారు. న‌ర్సంపేట డిపోకు అని ముందుగా పోలీసులు ప్ర‌క‌టించి మృత‌దేహాన్ని త‌ర‌లిస్తున్నామ‌ని చెప్పారు. ఆ త‌రువాత ఆయ‌న స్వ‌గ్రామ‌నికి త‌ర‌లిస్తున్న‌ట్లు చెప్పారు. శంక‌ర్ గౌడ్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న చేస్తున్న కార్మికులు త‌మ‌త‌మ డిపోల ముందు నివాళుల‌ర్పించారు.

న‌ర్సంపేట‌లో టెన్ష‌న్….టెన్ష‌న్….

అయితే రాజ‌కీయ పార్టీలు కూడా శంక‌ర్ గౌడ్ మృత దేహం నివాళుల‌ర్పించే య‌త్నం చేశారు. అయితే బీఆర్ ఎస్ నేత‌ల‌ను పోలీసులు ముందుగానే అరెస్టు చేశారు. క‌రీంన‌గ‌ర్ లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ న‌ర్సంపేట‌కు వెళ్లేందుకు బ‌య‌లు దేర‌డంతో అస‌లు టెన్ష‌న్ పోలీసుల్లోమొద‌లైంది. ఆంక్ష‌ల మ‌ధ్య అంత్య క్రియ‌లు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్న విధంగా పావులు క‌దిపారు. శంక‌ర్ గౌడ్ భౌతిక కాయాన్ని ఆయ‌న స్వ‌గ్రామం ముత్తోజిపేట‌కు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు. బండి సంజ‌య ఎంట్రీతో అక్క‌డ ప‌రిస్థితి మ‌రోసారి మారిపోయింది. రెండు ద‌శాబ్దాల‌కు పైగా న‌ర్సంపేట‌లో ఉద్యోగం చేస్తున్న శంక‌ర్ గౌడ్ మృత‌దేహాన్ని డిపోకు త‌ర‌లించాల‌ని ఆర్టీసి కార్మికులు చేస్తున్న డిమాండ్ కు సంజ‌య్ మ‌ద్ద‌తు తెలిపారు. కొద్దిసేపు అక్క‌డ నివాళుల‌ర్పించి స్వ‌గ్ర‌మంలో అంత్య‌క్రియ‌లు పూర్తి చేయాల‌ని కోరారు. పోలీసులు దీనికి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొంది. పోలీసులు, కార్మిక సంఘాలు, పొలిటిక‌ల్ పార్టీల మ‌ధ్య వాగ్వాదంతో అంత్య‌క్రియ‌ల‌కు ముందే తీవ్ర వివాదం రేగింది. పోలీసుల వైఖ‌రితో ముత్తోజి పేట‌లో ఉద్రిక్తంగా మారింది. శంక‌ర్ గౌడ్ డెడ్ బాడీని త‌ర‌లించే య‌త్నం కార్మికులు చేయ‌డం, అడ్డ‌గించే య‌త్నం పోలీసులు చేయ‌డంతో అక్క‌డే ఉన్న కేంద్ర మంత్రి బండి సంజ‌య్ పోలీసుల తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ బైఠాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *